అమరావతి: వైసిపి శాసనమండలి అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకట రమణ, మహమ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి బాలకృష్ణమాచార్యులకు వారు బుధవారం నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఏపి శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల ఏడున రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నోటిపికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో ముగ్గురు వైసిపి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.