ఇండియన్ ఆర్మీ అంబుల పొదిలో చేరేందుకు స్వదేశీయంగా తయారు చేయబడిన “తేజస్ ఎన్” యుద్ధ వివమానం సిద్ధమవుతోంది. భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడిఏ), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) లు సంయుక్తంగా కలసి రూపొందించిన ఈ యుద్ధవిమానం… డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజను తోపాటూ, మల్టీరోల్ లైట్ కాంబాట్ ను కలిగి ఉంటుంది. తేజస్, భారతదేశం అభివృద్ధి చేసి, తయారు చేసిన యుద్ధ విమానం. భారత వైమానిక దళం, భారత నావికాదళాలకు అందించడమే లక్ష్యంగా దీన్ని తయారుచేయడం జరిగింది.
ఈ యుద్ధ విమానం అనేక ఆధునికతల కలబోతగా… తోక లేని సంయుక్త డెల్టా-వింగ్ కాన్ఫిగరేషన్ ను ఒకే డోర్సల్ ఫిన్ తో కలిగి ఉంటుంది తేజస్. సంప్రదాయ వింగ్ డిజైన్ల కంటే మెరుగైన హై-ఆల్ఫా పనితీరును అందిస్తుంది. ఇదే క్రమంలో… రిలాక్స్డ్ స్టాటిక్ స్టెబిలిటీ, మల్టీ-మోడ్ రాడార్, ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియానిక్స్ సిస్టమ్ వంటి సాంకేతికతలను తేజస్ లో సమకూర్చారు. ఐఏఎఫ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీలను ఈ కొత్త జెట్ లో ఏర్పాటు చేయొచ్చని ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు.
ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమానం పూర్తిస్థాయిలో భారత ఆర్మీ అంబులపొదిలో ఎప్పుడు చేరుతుందనేదానిపై ఆసక్తి నెలకొంది. ప్రొటో టైప్ “తేజస్ ఎన్” యుద్ధవిమానాన్ని ఇప్పటికే పలు పరీక్షల్లో నిలబెట్టగా దిగ్విజయం సాధించింది. నేవీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ “ఐఎన్ఎస్ విక్రమాదిత్య”పై జరిపిన ట్రయల్ ల్యాండింగ్స్ కూడా సక్సెస్ అయ్యాయి. దీంతో దేశంలోనే తయారు చేసిన ఈ “తేజస్ ఎన్” వచ్చే ఆరేళ్లలో ఎయిర్ ఫోర్స్ లోకి చేరనుంది.
కాగా… మిగ్ -21 యుద్ధ విమానాల స్థానాన్ని భర్తీ చేసేందుకు 1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్సిఎ) కార్యక్రమం నుంచి రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003లో, ఈ యుద్ధవిమానానికి అధికారికంగా “తేజస్” అని పేరు పెట్టారు.