కరోనా నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది తాము నిత్యం ఉపయోగించే వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, కంప్యూటర్లు తదితర గ్యాడ్జెట్లను వారు శానిటైజ్ చేసుకుంటున్నారు. అయితే వాటిని ఆల్కహాల్తో కాకుండా యూవీ డివైస్తో శానిటైజ్ చేస్తే చాలా త్వరగా అవి కరోనా ఫ్రీ అవుతాయి. వాటిపై ఉండే సూక్ష్మ క్రిములను కేవలం 5 నిమిషాల్లోనే అంతం చేయవచ్చు. అందుకుగాను పోర్ట్రోనిక్స్ కంపెనీ కొత్తగా క్లీన్ ఎక్స్, క్లీన్ ఎక్స్ 101 పేరిట రెండు నూతన యూవీ స్టెరిలైజ్ డివైస్లను లాంచ్ చేసింది.
ఈ స్టెరిలైజ్ డివైస్ల ద్వారా మనం నిత్యం ఉపయోగించే కంప్యూటర్ కీబోర్డులు, ఫేస్ మాస్కులు, ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను చాలా తేలిగ్గా శుభ్రం చేయవచ్చు. ఈ డివైస్ లతో కేవలం 5 నిమిషాల్లోనే ఆయా గ్యాడ్జెట్లపై ఉండే సూక్ష్మ క్రిములు దాదాపుగా 99 శాతం వరకు నశిస్తాయి. వీటికి ఆన్, ఆఫ్ స్విచ్ను ఇచ్చారు. అందువల్ల వీటిని సులభంగా ఉపయోగించవచ్చు. వీటిల్లో రీచార్జబుల్ బ్యాటరీలను అందిస్తున్నారు. యూఎస్బీ కేబుల్ ద్వారా ఈ స్టెరిలైజ్ డివైస్లను చార్జింగ్ చేయవచ్చు.
కాగా క్లీన్ ఎక్స్ ధర రూ.2,499 ఉండగా, క్లీన్ ఎక్స్ 101 ధర రూ.1499 ఉంది. వీటిని అమెజాన్తోపాటు పోర్ట్రోనిక్స్ ఆన్లైన్ స్టోర్లోనూ కొనుగోలు చేయవచ్చు.