Breaking: తెలంగాణలో మే 6 నుండి 24 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు మొదలు కావాల్సి ఉండగా జేఈఈ మెయిన్ పరీక్షల తేదీ మార్పు చేయడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను మార్పు చేయాల్సి వచ్చింది. జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 21 నుండి మే 4వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
Breaking: మే 6 నుండి 24వ తేదీ వరకు
దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ను తెలంగాణ ఇంటర్ బోర్డు సవరించింది. మే 6 వ తేదీ నుండి 23వ తేదీ వరకూ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 7 వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జేఇఇ పరీక్షల కారణంగా షెడ్యుల్ మార్పు చేసినట్ల ఇంటర్ బోర్డు ప్రకటించింది.