Rashmi Gautam: మొదట యాంకర్ గా తరువాత ఆర్టిస్టుగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె జబర్దస్త్ కామెడీ షోకి ముందే కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ రాలేదు కానీ జబర్దస్త్ తర్వాత ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఈమె పాపులారిటీ చూసి ఈ క్రమంలో కొందరు చిన్న నిర్మాతలు కోరి మరీ రష్మీతో సినిమాలు చేయడం మనం చూసాం. ఆమె క్రేజ్ క్యాష్ చేసుకున్నారు కొందరు నిర్మాతలు. ఇప్పుడు ఆ కొందరు నిర్మాతలలో ఒకరు రష్మీ గౌతమ్ గురించి చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసాడు.
Rashmi Gautam: సోషల్ మీడియాలో నెటిజన్లకు కొత్త పాఠాలు నేర్పిన యాంకర్ రష్మీ..!!
Rashmi Gautam: రష్మీ ప్రస్తుతం ఏం చేస్తోంది?
రష్మీ ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు టీవీ షోలతో మంచి బిజీగా ఉంది. తాజాగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో ఐటం సాంగ్ చేసే అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. కెరీర్ సాఫీగా సాగుతున్న ఈ సమయంలో రష్మీపై ఆ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మీ తనను బెదిరించింది అంటూ మీడియా ముందుకొచ్చాడు.
Rashmika: వామ్మో.. ఐటెం సాంగ్కే రష్మిక అన్ని కోట్లు తీసుకుంటుందా?
ఆ నిర్మాత మాటలు ఇవే:
కొన్నాళ్లక్రితం రష్మీతో ‘రాణిగారి బంగ్లా’ అనే సినిమా తీసిన నిర్మాత నాగలింగం.. తాజాగా ఆమెపైన విరుచుకుపడ్డాడు. అప్పట్లో రష్మీ తనను బెదిరించిందని, ఇప్పటికీ ఆ కాల్ రికార్డు తనతో ఉందని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. రాణి గారి బంగ్లా సినిమా సగం అయ్యాక, తాను నటించలేనని రష్మీ చెప్పడంతో తాను షాక్ అయ్యానని, హీరోను మార్చమని గొడవకు దిగిందని.. చెప్పుకొచ్చాడు నాగలింగం. అక్కడితో ఆగకుండా నాగబాబు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు అంటూ బెదిరించిందని చెప్పుకొచ్చాడు నాగలింగం. దాంతో కేసుపెడతానని, ఇంకా వినకపోతే ఫిలిం నగర్ గేటుకి కట్టి అంతు చూస్తానని చెప్పడంతో మిగిలిన భాగం పూర్తి చేసిందని చెప్పుకొచ్చాడు.