Eatela Rajendar : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని ఇటు ఈటల అటు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈటలకు షాకిచ్చే మరో సంచలన నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్నారు.
Read More: Eatela Rajendar: రాజకీయాల్లో ఆత్మహత్యలే…ఈటల రాజేందర్ ఉదంతం అదే చెప్తోంది
కేసీఆర్ కీలక నిర్ణయం…
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి, ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్, విద్యార్ధి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారని ఆ పార్టీ ప్రభుత్వ ప్రకటన తెలిపింది. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో పనిచేశారని పేర్కొంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆ ప్రకటన వివరించింది.
Read More : Eatela Rajendar: హుజురాబాద్లో ఇంటెలిజెన్స్ సర్వే… ఈటల గురించి ఏం తేలిందంటే…
చరిత్ర పెద్దదే…
కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి, కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీలో 2001 లోనే చేరి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశారు. హుజూరాబాద్ టౌన్ నుంచి ఎంపీటీసీగా రెండుసార్లు ఎన్నికయ్యారు అని శ్రీనివాస్ గురించి వివరించింది. కాగా, శ్రీనివాస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు. హుజురాబాద్ నియోజకవర్గంలోని దళఙతుల ఓట్లను కైవసం చేసుకునే ఎత్తుగడలో భాగంగా ఆయనకు ఈ పదవి కట్టబెట్టారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.