Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు మరో షాక్ తగిలింది. మునుగోడు ప్రజాశాంతి అభ్యర్ధిగా ప్రజ-ా గాయకుడు గద్దర్ పోటీ చేస్తారని తొలుత కేఏ పాల్ ప్రకటించారు. తొలుత పోటీకి సుముఖత వ్యక్తం చేసిన గద్దర్ చివరకు డ్రాప్ అయ్యారు. దీంతో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ యే నిన్న రెండు సెట్ల నామినేషన్ లు సమర్పించారు. ఒకటి ప్రజా శాంతి పార్టీ తరపున, మరొకటి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే శనివారం నామినేషన్ల స్క్రూటినీలో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్ల ను అధికారులు తిరస్కరించారు. ఇలా తిరస్కరణకు గురైన నామినేషన్లలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి హోదాలో కేఏ పాల్ దాఖలు చేసిన నామినేషన్ కూడా ఉంది.
Munugode Bypoll: మునుగోడు కొత్త ఓటర్ల జాబితాపై హైకోర్టు ఏమన్నందంటే..?
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన గుర్తింపు లేని పార్టీల జాబితాలో ప్రజా శాంతి పార్టీ కూడా ఉండటంతో ఆ నామినేషన్ ను అధికారుుల తిరస్కరించారు. అయితే స్వతంత్ర అభ్యర్ధిగా దాఖలు చేసిన నామినేషన్ ను మాత్రం ఆమోదించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలవనున్నారు. ఇంతకు ముందు ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధులకు హెలికాఫ్టర్ ను ఎన్నికల గుర్తుగా అధికారులు కేటాయించే వారు. అయితే ఇప్పుడు స్వంత్ర అభ్యర్ధిగా బరిలో నిలవడంతో కేఏ పాల్ కు ఎన్నికల గుర్తు మారే అవకాశాలు ఉన్నాయి.