Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబకదా నేపథ్యంలో ముందుకు సాగుతూ విశేషంగా ప్రేక్షకుల ఆధారభిమానాలను సొంతం చేసుకుంటూ వస్తుంది. గేటుజా ఎపిసోడ్ లో నిరూపమ్ కొని ఇచ్చిన ఆటోను తిరిగి జ్వాల నిరూపమ్ కే ఇచ్చేయడంతో కధ మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి.ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా..ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, స్వప్న పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంటారు. ఇంతలోనే అక్కడికి శోభ వచ్చి ఏంటి ఆంటీ ఆటో బయట ఉంది అని అడగడంతో అప్పుడు స్వప్న జరిగింది మొత్తం వివరిస్తుంది. ఆ తర్వాత స్వప్న కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది
సీన్ కట్ చేస్తే జ్వాల మాత్రం ఇంటికి వచ్చి నిరుపమ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.ఆ తింగరి వలనే ఇదంతా జరిగింది అని హిమ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.ఇంతలోనే సౌందర్య, ఆనంద్ రావులు జ్వాల ఇంటికి వస్తారు.అప్పుడు జ్వాల ఆనంద్ రావును చూసి సంతోషపడుతూ హాయ్ యంగ్ మ్యాన్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది.ఆనందరావు కూడా జ్వాలను చూసి సంతోషిస్తాడు.అప్పుడు సౌందర్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఏమయింది సిసి అలా ఉన్నావు అని జ్వాల అడుగుతుంది. ఇక సౌందర్య మాత్రం చూడు జ్వాల నీ పర్మిషన్ లేకుండా మేము ఒక పని చేశాము అని చెబుతుంది.
ఏంటి సీసీ ఏమి చేసారు అని జ్వాల అంటే నువ్వు ఎంతగానో కోపం పెంచుకున్న ఆ తింగరిని ఇక్కడికి తీసుకు వచ్చాను అనడంతో జ్వాల కోపంతో రగిలి పోతూ ఉంటుంది.అప్పుడు సౌందర్య,హిమ గురించి చెబుతూ నా మాట విను జ్వాల అని ఎంత చెప్పినా వినకుండా జ్వాల మాత్రం కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు హిమ ఎదురు పడటంతో జ్వాల కోపంతో ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావే అంటూ సిగ్గులేని దానా అంటూ తిడుతూ హిమను ఇంట్లో నుంచి గేంటెస్తుంది.అప్పుడు సౌందర్య,ఆనంద్ రావులు ఎంత ఆపుతున్నా జ్వాల వినదు సరికదా సౌందర్య, ఆనందరావుల మీద కూడా సీరియస్ అవుతూ ఇలాంటి రాయబారాలు చేయాలి అనుకుంటే ఇంకొకసారి మా ఇంటికి రావద్దు అని అంటూ వారి ముఖం పై తలుపులు వేస్తుంది.
మరొక వైపు ఇంటికి వచ్చిన హిమ జరిగిన విషయాన్ని తలుచుకుని బాధ పడుతూ ఉండగా సౌందర్య, ఆనందరావులు వచ్చి హిమను ఓదారుస్తారు.కానీ హిమ మాత్రం బాధ పడుతూ ఎలా అయిన సౌర్య,నిరుపమ్ బావలను కలపాలి అని అంటుంది. సౌందర్య మాత్రం అది ఎలా సాధ్యమే.. నిరూపమ్ మనసులో జ్వాల లేదు కధ.. వాడు కూడా నా మనవడే హిమ. వాడి మనసులో నువ్వు ఉన్నావ్ బలవంతంగా వేరొకరిని పెళ్ళి చేసుకో మని ఎలా చెప్పగలం అంటుంది సౌందర్య. ఏమో నాన్నమ్మ వాళ్ళకి ఎలా అయినా పెళ్లి చేయాలి అంటుంది హిమ.
సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం దుర్గ జ్వాల ఆటో కి బొట్టు పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు.అప్పుడే గుడికి వెళ్లే గిరాకీ రావడంతో జ్వాల గుడికి వెళ్తుంది. అదే సమయంలో నిరూపమ్ నిరుపమ్, హిమలు గుడిలో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. నిరుపమ్ పెళ్లి ఫిక్స్ అయినందుకు అమ్మవారికి ముడుపు కడతాను అని అనగా,హిమ నీకు,జ్వాలా కి పెళ్లి జరగాలని నేను ముడుపు కడతాను అని ఇద్దరు కూడా ముడుపులు కడుతూ ఉండగా జ్వాల చూసి తింగరిపై మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…