Nindu Noorella Saavasam November 04 episode 72: కొంచెం ఆలోచించుకొని మాట ఇవ్వాల్సింది అమృత అంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు అంజు పాప చదువుకుంటున్నార మీరు బయటికి వెళ్ళండి అని బాగామతి అంటుంది. కొంచెం చాలా ఎక్కువ చేస్తున్నావు కొద్దిసేపు ఆగితే నీకే అర్థమవుతుంది అని అమృత ఉంటుంది. అంజు పాపా నువ్వు బాగా చదువుకో అమ్మ వాళ్ళు అలాగే అంటారు అని భాగమతి అంటుంది . నేను నిన్ను అడిగానా నన్ను బాగా చదివించమని నువ్వు ఎందుకు ప్రిన్సిపాల్తో అలా మాట్లాడావు అసలే మేడానికి నాకు పడదు నువ్వేమో ఇప్పుడు ఛాలెంజ్ చేశావు అని అంజు అంటుంది. ఏంటి అంజు పాప వాళ్ళ ముగ్గురు నీ గురించి అలా మాట్లాడుతున్నారు బాగా చదవాలి నిన్ను ఎగతాళి చేసిన వాళ్లు నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగడాలి అని భాగమతి అంటుంది.
చూడు మిస్సమ్మ నేనంటే వాళ్ళకి ఏంటో అర్థమైంది కానీ నీకే అర్థం కాలేదు ముందు ముందు అర్థం అవుతుందిలే అని అంజు అంటుంది. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని భాగమతి అంటుంది. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం మా గుర్తుకు వస్తే ఏడుపొస్తుంది ఈ లోకంలో మా అమ్మను మించిన అమ్మాయి ఇంకెవరూ ఉండరు అంత మంచిది మా అమ్మ నాకు భయం వేస్తే మా అమ్మని పది నిమిషాలు పట్టుకుంటే చాలు నా భయం అంతా పోయేది మనం చాలా మిస్ అవుతున్నాను అని అంజు పాప ఏడుస్తుంది. మీ అమ్మ అంటే అంత ఇష్టమైనప్పుడు మరి ఇంట్లో ఒక్క ఫోటో కూడా లేదేంటి అని భాగమతి అంటుంది. మనోహరి ఆంటీ వద్దని తీసేసింది అమ్మ ఫోటో ఇంట్లో ఉంటే తనను చూస్తూ ఇంకా బాధపడతామని అమ్మ ఫోటో తీసేసింది అని అంజు అంటుంది. ఎందుకు అనుకుంటారు
మీ అమ్మతో మాట్లాడలేక అలా ఫోటోని చూసుకుంటూ మీరు హ్యాపీగా ఉంటారు కానీ తన ఫోటో కూడా కనపడకపోతే ఇలాగే బాధపడతారు ఉండు మీ తాతని నాయనమ్మని అడిగి ఫోటో పెట్టిస్తాను అని భాగమతి వెళ్ళిపోతుంది. గుప్తా గారు మిస్సమ్మ నా ఫోటో హాల్లో పెట్టిస్తుందంట ఇప్పుడు ఏం చేద్దాం అండి అని అంటుంది అరుంధతి. నన్ను ఏం చేయమంటావు బాలిక నా ఉంగరం నాకు ఇస్తే మన లోకముకు పోయెదము అప్పుడు నీకు ఈ తిప్పలు రావు కదా అని గుప్తా అంటాడు. సందు దొరికితే చాలు నా ఉంగరం అని నన్ను చావ కొడుతున్నావు అంటే నన్ను దొంగని చేస్తున్నావా అని అరుంధతి ఉంటుంది. అయ్యో బాలిక నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు అని గుప్తా అంటాడు. కట్ చేస్తే, మి గదిలోకి రావచ్చా అంకుల్ అని భాగమతి వాళ్ళని పర్మిషన్ అడుగుతుంది. నువ్వు ఇంట్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది అమ్మ ఇంకా గదిలోకి రావచ్చా అని మమ్మల్ని అడుగుతావేంటి అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. ఇంట్లోకి హాల్లోకి వచ్చాను కానీ గదిలోకి అడగకుండా రాకూడదు అది సంస్కారం కాదు అని భాగమతి అంటుంది.
ఈరోజుల్లో నీలా ఆలోచించే వాళ్ళు ఎక్కడుంటారు అమ్మ ఆలోచన మంచిదే కానీ లోపలికి రామ్మా అని అమరేంద్ర వాళ్ల అమ్మ అంటుంది. అంకుల్ మీ కోడలు ఫోటో ఒకటి కూడా ఇంట్లో లేదు ఎందుకు అని భాగమతి అంటుంది. పిల్లలు బాధపడతారని మనోహరి చెప్తే అమరేంద్ర హాల్లో పెట్టలేదమ్మా అని అమరేంద్ర వాళ్ల అమ్మ అంటుంది. మీరు ఆవిడని చాలా మిస్ అవుతున్నారు అంకుల్ తన ఫోటో ఒకటి కూడా లేకపోతే మీరు ఇంకా బాధపడతారు కదా భాగమతి అంటుంది. చచ్చిపోతే కదమ్మా తనని మిస్ అవ్వడానికి మా ఇంట్లో లేకపోయినా మాలో బ్రతికే ఉంది మా జ్ఞాపకాలలో ఉంది భగవంతుడు తనను తీసుకువెళ్లిపోయాడు కానీ ఎప్పుడూ మేము తనని మరిచిపోము అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. వాళ్ళ అమ్మ ఫోటో హాల్లో ఎదురుగా ఉంటే పిల్లలు కొంచెం రిలీఫ్ అయ్యి బాధను పోగొట్టుకొని బాగా చదువుకుంటారు
అంకుల్ ఆ ఫోటో హాల్లో పెట్టించండి అని భాగమతి అంటుంది. నీ ఆలోచన బాగానే ఉంది కానీ అమరేంద్ర కబోర్డ్ లో ఉంది వెళ్లి తెచ్చి పెట్టమ్మా అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది.ఇలా బాధపడతారని తన జ్ఞాపకాలు మరిచిపోయి మీరు ఆవిడ ఫోటోని పక్కన పెట్టేస్తారా అది కాదండి తన మీద మీకు ఉండే ప్రేమ ఎప్పుడు మీ కళ్ళముందే ఉంటే తనను చూసి మీరు బాధని మర్చిపోతారు కాని జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతామని అలా పక్కన పెట్టేస్తారా మీరు ఒప్పుకుంటే హాల్లో అందరూ చూసేలా పెట్టిస్తానండి అని భాగమతి అంటుంది. అలాగే అమ్మ అమరేంద్రను ఒక మాట అడిగి అలాగే చేయి అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. ఇప్పుడు ఆ బాలిక నీ చిత్రపటమును చూస్తే చిత్రవిచిత్రంగా ఉండును అని గుప్తా అంటాడు. అది జరగకూడదనే కదా గుప్తా గారు నేను ఇంతలా బ్రతిమిలాడేది ఏదో ఒకటి చెయ్యి అని అరుంధతి అంటుంది . నేను ఏమీ చేయలేను బాలిక అని గుప్తా అంటాడు.
అయ్యో గుప్తా గారు ఇప్పుడు ఎలా చెల్లి ఫోటో చూసేస్తుందేమో అని అరుంధతి అంటుంది.కట్ చేస్తే,లైఫ్ ఇంత బోర్ గా ఉంటుందని నేను అనుకోలేదు ఒక ఎంజాయ్మెంట్ లేదు ఒక ఆనందం లేదు, సోల్జర్స్ ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంజు అంటుంది. రావమ్మ చదువుల తల్లి నువ్వు మాతో ఎందుకు వస్తావు చెప్పు నువ్వు చదువులో బాగా బిజీ అయిపోయావు కదా అని అమృత అంటుంది. అది సరే కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అని అంజు అంటుంది. నీలా ఆంటీకి దెబ్బ తగిలింది కదా అప్పటినుంచి ఆంటీ దగ్గరికి వెళ్లి పలకరించలేదు ఇప్పుడు వెళ్లి మాట్లాడదామని అనుకుంటున్నాము అని అమృత ఉంటుంది. అయితే రండి నేను కూడా వస్తాను అని అంజు అంటుంది. నువ్వు వెళ్లి చదువుకోవచ్చు కదా అంజు మూడు రోజుల్లో ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు అని అమృత అంటుంది. అసలే నీ మీద నమ్మకం పెట్టుకొని ఆ మిస్సమ్మ ఛాలెంజ్ చేసింది నువ్వేంటి ఇలా మాతో తిరుగుతాను అంటున్నావు వెళ్లి చదువుకో అని ఆకాష్ అంటాడు. అవును కదా అని అంజు ఆలోచిస్తూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!