Padamati Sandhya ragam: మంచి ఫ్లాట్ ఫారం గా పేరు పొందిన జి తెలుగు ఫ్లాట్ ఫారం పై అనేక సీరియల్స్ ప్రసారమవుతూ మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో స్టార్ మా కి ఎక్కువ రేటింగ్ దక్కినప్పటికీ ఆ రేటింగ్ ను సంపాదించుకునేందుకు జీతెలుగు వారు కూడా పలు మంచి కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఇక అలా వారు తీసుకొచ్చిన సీరియల్స్ లో పడమటి సంధ్యారాగం సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో ఉండే మలుపులు మరే సీరియల్ లో ఉండవని చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి యాక్టర్ కి కూడా మంచి పాపులారిటీ దక్కింది.
ప్రసారమైన కొద్ది రోజుల్లోనే మంచి మేర పాపులారిటీ సంపాదించుకున్న ఈ సీరియల్లో యాక్ట్రెస్ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ప్రస్తుతం జీ తెలుగులోనే నెంబర్ వన్ స్థానాన్ని కూడా దక్కించుకుంది. ఈ సీరియల్ లో ఇద్దరు అక్క చెల్లెలు అలానే తండ్రి కూతుర్లు మధ్య ఉండే ఓ సంఘర్షణ ను ప్రేక్షకులకి కొట్టొచ్చినట్లు చూపిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో రామలక్ష్మి పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ రియల్ లైఫ్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పడమటి సంధ్యారాగం సీరియల్ లో రామలక్ష్మి పాత్ర నటిస్తున్న సౌందర్య రెడ్డి కన్నడ అమ్మాయి. ఈమె కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఇక తను ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా బెంగళూరులోనే కంప్లీట్ చేసింది.
ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెకి చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో.. మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అనంతరం సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె స్కూల్ స్టేజ్ లోనే మోడలింగ్ ఈవెంట్స్ కు పార్టిసిపేట్ చేస్తూ తన అంద చందాలను ఆరబోసేది. అలా పెద్దయ్యాక మోడలింగ్ రంగంలో ఆరితేరి కన్నడలో ఓ సీరియల్ లో నటించి మంచి మేర పాపులారిటీ పొందింది. ఈ సీరియల్ కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది. ఇక అనంతరం తమిళనాడులో కూడా ఓ సీరియల్ లో నటించింది.
అనంతరం కన్నడలో కొనసాగి ప్రస్తుతం తెలుగులో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు మరియు సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన బిజీ లైఫ్ని పొందుపరుస్తుంది. ఇక పడమటి సంధ్యారాగం సీరియల్ లో తన యాక్టింగ్ను నిరూపించుకుని తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇటీవలే ఈమెకి పెళ్లయినట్లు పిల్లలు కూడా ఉన్నారని అనేక ప్రచారాలు జరిగాయి. వాస్తవానికి ఈ ప్రచారాలలో ఎటువంటి నిజం లేదు. రామలక్ష్మి ఇప్పట్లో పెళ్లి చేసుకోనని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. దీంతో ఈ వార్తలకు అడ్డు కట్టపడింది.