(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
జనతా కర్ఫ్యూ ఆరంభం మాత్రమే. పోరాటం ఇంకా ఉంది. దేశాన్ని కరోనా నుండి రక్షించుకోడానికి మోదీ మదిలో ఇంకా ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఆయన జనతా కర్ఫ్యూ ఆరంభమే అంటూ చెప్పుకొస్తున్నారు. కరోనా ప్రస్తుతానికి దేశంలో అంత ఆందోళనకరంగా ఏమి లేదు. కానీ అప్రమత్తత చటాల్సిన దశలో మాత్రం ఉంది. రోజు రోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు క్రమేణా పెరుగుతున్నాయి. ఇంకా పెరిగితే ఎలా? ఏం చేస్తారు? ఎలా నియంత్రిస్తారు? అనేది సర్వత్ర ఎదురవుతున్న ప్రశ్నలు. ఉత్తర కొరియాలా బాధితులని చంపేస్తారా? చైనాలా బాధితులని దాచేస్తారా? వయసు ముదిరిన వారిని చంపేస్తారా? అనే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇవన్నిటి కంటే మోడీ మదిలో జనతా కర్ఫ్యూ తరహాలోనే సామాజిక ఆలోచనలు అనేకం ఉంటాయి. అంటే ఉదాహరణకి దేశం మొత్తం లాక్ డౌన్ కి వెళ్తుంది. కనీసం రెండు వారాలు పాటు దేశాన్ని పూర్తిగా కట్టడి చేస్తారు. అన్ని రాష్ట్రాల, జిల్లాలు కేంద్రం నియంత్రణలోకి వెళ్తాయి. బలవంతపు నిర్బంధం అమలవుతుంది. ఇలాంటివి… వీటితో పాటు కరోనా కట్టడి కాకపోతే అప్పుడు కఠిన చట్టాలు అమల్లోకి వస్తాయి. ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుంది.
జనతా కర్ఫ్యూతో కరోనాపై పోరాటానికి ప్రజలను సిద్ధం చేయడమే మోడీ ఉద్దేశం. నిజానికి ఇది ఒక ప్రేరణ కలిగించే పిలిపు. జనంలో అవగాహన పెంచే, వారిని సమాయత్తం చేసే ఒక కార్యక్రమం. పనిలో పనిగా వైద్యుల ప్రాముఖ్యత తెలిసేలా, వారికి స్ఫూర్తి కలిగేలా చప్పట్లు కొట్టించారు. ఇది దేశ సామాజిక విజయం.
- కరోనా కట్టడి కానీ తరుణంలో ఏకధాటిగా 12 రోజులు జనతా కర్ఫ్యూకి సన్నద్ధం చేయడం. ఇది మొదటి దశ. ఈ 12 రోజులకు సరిపడా సరుకులు, ఇంటి అవసరాలు ఇళ్లకు చేర్చడం. దేశమంతటా బ్రిటిష్ కాలం నాటి ఎపిడిమిక్ డీసీజ్ 1897 చట్టాన్ని అమల్లోకి తేవడం. 12 రోజులు జనతా కర్ఫ్యూకి సహకరించని పక్షంలో పోలీసులు, కేంద్ర బలగాలు ద్వారా బలవంతపు నిర్బంధాన్ని కూడా అమలు చేసే వీలుంది.
- అదుపు కాకుంటే మెడికల్ ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుంది. తగిన మందులు, సిబ్బందిని సిద్ధం చేసుకుని, దేశమంతటా అన్ని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల ద్వారా చికిత్స అందించడం. మెడికల్ ఎమర్జెన్సీ తర్వాత ఫుడ్ ఎమర్జెన్సీ, ఫినాన్సియల్ ఎమర్జెన్సీ విధించే వీలుంది. కనీసం రెండు, మూడు నెలలకు సరిపడా ఆహార నిల్వలు, అత్యవసర వినియోగ నగదుని సిద్ధం చేసుకుని ఇళ్లకు ప్రమితమవ్వడం.
- కరోనా నియంత్రణకు రానున్న 10 రోజుల్లో కీలకం. నియంత్రణ కాకుంటే దేశంలో కొన్ని కఠిన చట్టాలు, కఠిన నిబంధనలు అమల్లోకి తేవడం ద్వారా బలవంతపు నియంత్రణకు పూనుకోడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు.