బిగ్ బాస్ ఇంట్లో ఈరోజు హీరో అనుకున్న వాడు రేపు జీరో కావచ్చు. నేడు వీక్ కంటెస్టెంట్ అనుకున్న వాడికి స్టార్ రేంజ్ లో ఫాలోయింగ్ రావచ్చు. ఈ క్షణం అతను తప్పు చేశాడు అనిపిస్తే…. వచ్చే ఎపిసోడ్స్ లో అతను చేసింది కరెక్టే కదా అని అనిపిస్తుంది. ఆట, టాస్క్, టాస్క్ సీక్రెట్, పర్ఫార్మెన్స్ ఏదైనా సరే బిగ్ బాస్ లో ప్రతి నిమిషం క్షుణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
తాజాగా మొదట్లో మంచి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న అఖిల్ సార్థక్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నాడు. ఉక్కు హృదయం టాస్క్ లో అమ్మాయిలను అడ్డం పెట్టుకుని మీరు ఆడారు అంటూ అభిజిత్ అండ్ గ్యాంగ్ పై విపరీతంగా రెచ్చిపోయిన అఖిల్ మొన్న కాయిన్స్ టాస్క్ లో లో రాజశేఖర్ అన్న కామెంట్లకు బాగా ఫైర్ అయ్యాడు.
టాస్క్ రెండోదశలో బిగ్బాస్ మంచి వ్యూహం పన్నాడు. అందులో అవుట్ అయిపోయిన వారికి 50 శాతం కాయిన్స్ తగ్గిపోతుందని తెలిపాడు. అందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చి అడాలి అని చెప్పాడు. అఖిల్, మెహబూబ్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. గార్డెన్ ఏరియాలో టాస్క్ అని చెప్పినా కూడా లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఇక్కడ ఆడవాళ్లు వచ్చి ధైర్యంగా ఉన్నారు మీరు ఎలా లోపల ఉన్నారు అంటూ అమ్మ రాజశేఖర్ అఖిల్ పై ఫైర్ అయ్యాడు.
అఖిల్ అందుకు ఆగ్రహం వ్యక్తం చేసి ఇది మా స్ట్రాటజీ అని సమాధానం ఇచ్చాడు. మరి దివి ని కిడ్నాప్ చేయడం కూడా ఒక స్ట్రాటెజీ అన్న విషయం మర్చిపోయాడు. ఇంకా అప్పుడు బిగ్ బాస్ ఎవరిని ఏమి చేయకూడదు అని ఏమీ చెప్పలేదు…. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గార్డెన్ ఏరియా లో ఉండే టాస్క్ పూర్తి చేయాలని ఆదేశించాడు. నిబంధనలను ఉల్లంఘించడం అఖిల్ స్ట్రాటెజికల్ గేమ్ అయితే తెలివిగా ప్రత్యర్థులను బోల్తా కొట్టించి కిడ్నాప్ చేస్తే మాత్రం అది ఆడవాళ్ల గేమ్ అట.
ఈ రెండింటి మధ్యలో వ్యవహారంలో చాలా నెగిటివిటీ ని అఖిల్ మూటగట్టుకున్నాడు. అప్పుడు ఆడవారిని అడ్డంపెట్టుకుని ఆడారు అన్నమాటలకు ఇప్పుడు అఖిల్ చేసిన పనికి ప్రస్తుతం తూగడమే లేదు అంటున్నారు నెటిజన్లు.