నూతన మోటారు వాహనాల సవరణ చట్టం-2019’లోని 28 నిబంధనలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి అమలైన ఈ చట్టంపై ఇప్పటికే చాలా మందికి అవగాహన ఏర్పాడింది, నిబంధనలను పాటించనివారిపై కఠినమైన చర్యలు ఉపక్రమించేలా బిల్లును రూపోదించారు. ఈ చట్టంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన పాలనాపరమైన నిబంధనలనే ఎక్కువగా ఉన్నాయి. ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలూ తప్పకుండా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.
ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకోస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలలో చిన్న పిల్లల ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనలపై వెళుతున్న చిన్నారులు హెల్మెట్ లేని కారణంగా ప్రమాదాలు జరిగిన సమయంలో మృతివాత పడుతున్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్ప డు 4ఏళ్ల పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేశారు. ద్విచక్రవాహనంపై ప్రయాణించే ఇద్దరికి హెల్మెట్ తప్పక ధరించాలని ఈ చట్టంలో పేర్కొన్నారు.
మొత్తం 28అంశాలను పొందుపరిచిన ఈ బిల్లులో నింబంధనలు పాటించని వాహనాలపై భారీ జరిమానాల విధిస్తారు, హెల్మె ట్ లేకుంటే వాహనం నడిపేవారికి రూ.వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. వరుసగా మూడుసార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సును పూర్తిగా రద్దు చేస్తారు. పరిమితికి మించి ప్రయాణిస్తే రూ.2000, మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే రూ.2వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5వేల వరకు జరిమానలు విధిస్తారు.