Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు అని అందరికీ తెలుసు. అటువంటి మహేష్ ఇండస్ట్రీలో మాత్రమే కాక యాడ్స్ రంగంలో కూడా తనకంటూ సెపరేట్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మార్కెట్ లో బడా బడా కంపెనీలకు అంబాసిడర్ గా మహేష్ బాబు వ్యవహరిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ లో “అర్జున్ రెడ్డి” అనే మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ వంగా దర్శకత్వంలో మహేష్ నటించడానికి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది.
మేటర్ లోకి వెళ్తే మహేష్ బాబును హావెల్స్ బ్రాండ్ యాడ్ కోసం డైరెక్ట్ చేసే ఛాన్స్ సందీప్ వంగా దక్కించుకున్నట్లు సమాచారం. ఈ యాడ్ లో మహేష్ బాబుతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. ఇది లా ఉంటే గతంలో మహేష్ బాబుతో “ఆగడు” సినిమాలో తమన్నా నటించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా లో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. ఇద్దరూ మంచి తెల్లగా ఉండే గంట కావటంతో సరైన హిట్ పడకపోయినా గాని..ఇద్దరి జంట ని ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో హావెల్స్ బ్రాండ్ యాడ్ కోసం వీరిద్దరిని డైరెక్టర్ సందీప్ వంగ సెలక్ట్ చేసుకున్నట్లు టాక్. ప్రస్తుతం మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తూ ఉండగా మరో పక్క తమన్నా గోపీచంద్ నటించిన సిటీ మార్ లో హీరోయిన్ గా చేస్తుంది.