కరోనాతో పోటీపడుతున్న ఈ ప్రపంచం రోజు రోజుకు ఒక కొత్త రూపం దాలుస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రపంచానికి ఒక సవాల్ గా మారింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలను బలిగొంటోంది. ఇంతటి ప్రాణాంతకమైన వ్యాధిని ముందుగా గుర్తించి సరైన చికిత్స చేయించుకోవడం వల్ల ప్రాణభయం నుంచి బయట పడొచ్చు. ఈ వైరస్ ఎక్కువగా వయసు మళ్ళిన వారిపైన, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిలో ఇంకా చిన్నపిల్లలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఇదివరకు జలుబు ..దగ్గు.. గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే కరోనా అనీ బావించేవారు. కానీ వీటికన్నా ముందు ఇప్పుడు మరికొన్ని లక్షణాలతో బాధపడుతూ ఉంటే అది కూడా కరోనా లక్షణమే అని నిపుణులు అంటున్నారు. మరి ఆ లక్షణాలు ఏమిటి? వాటి ప్రభావం మన ఆరోగ్యంపై ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసు..
సాధారణంగా ఇదివరకు కరోనాతో బాధపడేవారు జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు కనిపిస్తే వారికి కరోనా లక్షణాలు గా భావించి పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ కరోనా పాజిటివ్ అయితే వారు తగిన జాగ్రత్తలు తీసుకొని, చికిత్స చేయించుకోవడం ఎంతో అవసరం. కానీ ప్రస్తుతం నిపుణులు వీటి కన్నా ముందుగా మనలో కళ్ళు మంటగా అనిపించడం, రుచి.. వాసన వంటి వాటిని గమనించలేకపోతే అవి కూడా కరోనా లక్షణాలేనని వెల్లడించారు.
ఇన్నిరోజులు కరోనా కేవలం శ్వాసకోశ వ్యవస్థ మీద మాత్రమే దాని ప్రభావం చూపుతుందని భావించారు. కానీ ప్రస్తుతం ఈ కరోనా ప్రభావం ఏకంగా నాడీ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తోందని, అందువల్లే మనకు రుచి,వాసన వంటివి తెలియకపోవడం జరుగుతుందని నార్త్ వెస్ట్రన్ మెడిసన్ తన పరిశోధనలో భాగంగా 19 మంది బాధితులలో కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో దగ్గు ,జలుబు కంటే ముందుగా నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తలెత్తినట్లు నిర్ధారించారు.
ఈ పరిశోధనలో భాగంగానే కరోనా వైరస్ నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలియజేశారు. ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తే, వెంటనే అప్రమత్తమై డాక్టర్లను సంప్రదించి సరైన సమయంలో చికిత్స చేయించుకోవడం ఎంతో శ్రేయస్కరం.