చిన్న చిన్న విషయాలను మరిచిపోతున్నారా..? ఆ మతిమరుపుపోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
మతిమరుపు పోవాలంటే చాలా సింపుల్.. రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యం బాగుంటటమే కాదు.. మతిమరుపు కూడా దూరమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముసలి వయసులో కనిపించే అల్జీమర్స్కి ఇది మంచి మందు అని చెబుతున్నారు. యాపిల్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. వయసు పెరుగుతున్నా కొద్దీ అందరిలో జ్ఞాపక శక్తి తగ్గుతూ వస్తుంది.
మన మెదడులో నాడుల మధ్య సమాచారం ప్రసారం కావడానికి కొన్ని రకాల రసాయనాలు కారణం. మన మెదడు సరిగ్గా పని చేయాలన్నా.. జ్ఞాపకశక్తి సరిగ్గా ఉండాలన్నా.. ఆ రసాయనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రసాయనాలు సరిగ్గా రిలీజ్ కాకపోతే.. మెదడు పనితీరులో సమస్యలు వస్తాయి. అయితే యాంటి ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలనున నివారించొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
ఈ విషయంపై మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ముందుగా ఎలుకలపై చేసిన రీసెర్చ్ లో యాపిల్ ప్రాముఖ్యత తెలిసివచ్చింది. మనం తినే యాపిల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన జ్ఙాపక శక్తిని మెరుగు పరుస్తాయని తేలింది. ఈ యాపిల్స్ తో పాటుగా యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే రకరకాల పండ్లను రోజూ తీనాలని సైంటిస్టులు చెబుతున్నారు. వీటి వల్ల వయసు వల్ల చర్మంపై ఏర్పడే ముడతలు కూడా పోతాయని సూచిస్తున్నారు. ఇలా తినడం వలన చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇక మీరుకూడా ఓ సారి ట్రైచేసి చూడండి. మీ జ్ఙాపక శక్తితో పాటు చర్శ సౌందర్యం కూడా మెరుగుపడొచ్చు.