కొందరు మహిళలు ఆదర్శంగా నిలుస్తుంటే మరికొందరు మహిళల పరువు తీస్తున్నారు. ఇక అలానే ఇంటి పోషణ కోసం దేశం కానీ దేశంకు కుటుంబ పోషణ కోసం భర్త వెళ్తే భార్య మాత్రం ఇంట్లోనే ఉండి ప్రియుడితో రాసలీలు చేస్తుంది. ఆ విషయాన్నీ ఎక్కడ భర్తకు చెప్తారో అని ఇంటి ఓనర్ ను దారుణంగా చంపించింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మూడు సంవత్సరాల క్రితం తమిళనాడులోని నాగై జిల్లా సీర్గాళిలో రామ్, బృంద అనే భార్యాభర్తలు అద్దెకు దిగారు. అయితే భర్త రామ్ ఉద్యోగ రీత్యా సింగపూర్ వెళ్లాడు. ఏం పని చెయ్యాలో తోచని ఆ మహిళ కంప్యూటర్ నేర్చుకుంటా అని ఓ కోర్స్ లో జాయిన్ అయ్యింది. అక్కడ ఆమెను చుసిన రియాజుద్దీన్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
నిజానికి వారిద్దరికి గతంలోనే పరిచయం ఉంది. ఒకరిని ఒకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ మతం వేరు కావడం వల్ల పెళ్లి చేసుకునేందుకు వెనకడుగు వేశారు. ఇక ఇప్పుడు ఇద్దరు మళ్లీ కలవడంతో మళ్లీ పాత ప్రేమ గుర్తొచ్చింది. భర్త ఇంట్లో లేడు అని తెలియడంతో తరచూ వచ్చి వెళ్ళేవాడు. అయితే ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు ఇంటి ఓనర్ కి ఫిర్యాదు చేశారు.
దీంతో ఇంటి ఓనర్ ఉష వారిని తిట్టింది. బృందకు కూడా భర్తకు చెప్తా అని ఉష చెప్పింది. అయినప్పటికీ ఆమెవినకపోగా ఎక్కడ భర్తకు చెప్తుందో అని భయపడి ప్రియుడుతో చెప్పడంతో ఆమెను ప్లాన్ చేసి దారుణంగా చంపేశారు. ఆతర్వాత ఏమి తెలియదు అని నాటకం ఆడినప్పటికి సీసీకెమెరాల ద్వారా వారిని కనుక్కొని పోలీసులు అరెస్ట్ చేశారు.