టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు కమర్షియల్ గా అతి భారీ హిట్ లను సాధించాయి. ఇక ప్రస్తుతం మహేష్ తన తదుపరి సినిమాను పరుశురాం దర్శకత్వంలో చేస్తున్నాడు. ‘సర్కారు వారి పాట’ అని ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు.
మహేష్ కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొట్ట మొదటి సారి అతను కీర్తి సురేష్ తో కలిసి నటిస్తున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ అనిల్ కపూర్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ సినిమాలో మహేష్ కు అక్క క్యారెక్టర్ ఉందట. ఎలాగో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా పేరొందిన మంచి నటి చేత ఈ ప్రాత్రని చేయించాలని నిర్ణయించుకున్నారట. ఇదే క్రమంలో ‘డర్టీ పిక్చర్’తో ఒక్కసారిగా దేశాన్ని షేక్ చేసిన విద్యాబాలన్ డేట్ల కోసం సర్కారు వారి పాట టీమ్ తెగ తిరుగుతోందట. ఈ క్యారెక్టర్ కు ఆమె అయితేనే న్యాయం చేయగలదని వారు భావిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం విద్యా తో చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికోసం మహేష్, టీం స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా వెళ్లనుందని సమాచారం. సందేశాత్మక అంశాలతో పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ పక్కా మాస్ అవతార్ లో కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే అభిమానులకి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మొదట్లో సంప్రదాయబద్దమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన విద్యాబాలన్ ఇప్పుడు క్రమంగా గ్లామర్, బోల్డ్ పాత్రలు చేయడం మొదలుపెట్టింది. మరి మహేష్ సినిమాలో విద్యాబాలన్ కు క్యారెక్టర్ ఎలాంటిదో…. ఈమె ఏమంటుందో లేదో వేచి చూడాలి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!