మౌనరాగం, మనసు మమత సీరియల్స్ ఫేమ్ శ్రావణి ఆత్మహత్య వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ప్రధానంగా ఈ కేసులో ముగ్గురైన దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డిలను పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో దేవరాజ్ రెడ్డిని పోలీసులు మొదటగా అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసు విషయంలో ప్రధానంగా సాయి కృష్ణ రెడ్డి, శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నది దేవరాజ్ మీదే. తన వేధింపులు తట్టుకోలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. శ్రావణికి దేవరాజ్ టిక్ టాక్ ద్వారా పరిచయమైన సంగతి తెల్సిందే. దేవరాజ్ ను పెళ్లి చేసుకుందామని శ్రావణి భావించినట్లుగా తెలుస్తోంది. అయితే దేవరాజ్ ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసాడని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆడియో సంభాషణ కీలకంగా మారింది.
ఆ ఫోన్ సంభాషణలో తనతో మర్యాదగా వచ్చి ఒక గంట గడపాలని దేవరాజ్ శ్రావణిని బెదిరించినట్లుగా ఉంది. ఒకవేళ తన వద్దకు రాకపోతే మాత్రం కచ్చితంగా తర్వాత జరిగే పరిమాణాలకు తనను అడగవద్దని దేవరాజ్ ఆ ఫోన్ కాల్ లో తెలిపింది. మొత్తంగా శ్రావణి ఫోన్ సంభాషణలో ప్రాధేయపడుతున్నట్లుగానే మాట్లాడింది. ఫోన్ సంభాషణ చివరికి నీతో మాట్లాడను దేవా అంటూ శ్రావణి ఫోన్ సంభాషణ ముగించింది. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ఆమె ఆత్మహత్యలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే ఆత్మహత్య చేసుకున్న రోజు కొద్ది నిమిషాల ముందు దేవరాజ్ కు ఫోన్, మెసేజ్ కూడా చేసినట్లు శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానన్న మాట ఇవ్వకపోవడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.