ఏంటి అతనికి పిచ్చ? అని మీకు అనిపించ వచ్చు. కానీ ఈ వ్యక్తి నిజంగానే దోమలకు రక్త దానం చేశాడు. ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. సాధారణంగా ఒక దోమ కొడితేనే అబ్బా అని దాన్ని చంపేస్తాం. ఇక ఆ దోమలు కుట్టాయ్ అంటే ఎన్నో రకాల వ్యాధులు వస్తాయ్ అని భయపడిపోతారు.
అలాంటిది అతను ఏకంగా 5 వేల దోమలతో కుట్టించుకున్నాడు. దీనికి కారణం ఏంటో తెలిస్తే అతడు నిజంగా గ్రేట్ అనుకుంటారు. ఎందుకంటే దోమలు కుట్టడం వల్ల మనిషికి ఎలాంటి వైరస్ లు వస్తాయ్.. ఎలాంటి రోగాలు వస్తాయ్ అని తెలుసుకునేందుకు ఓ కీటకాల శాస్త్రవేత్త ఆలా చేశాడు.
సాధారణంగా వర్షాకాలం వచ్చినాసమయంలో కుట్టే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా,ఎల్లో ఫీవర్ వంటి కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయి. ఇక ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్ ఒకటి వచ్చింది. అందుకే కొత్త ఏదైనా దోమల వల్ల వైరస్ వస్తుందా అని తెలుసుకునేందుకు అతను ఆ పని చేశాడు.
5 వేల దోమలకు రక్త దానం చేసిన ఆ శాస్త్రవేత్త.. దోమల కుట్టిన తర్వాత అతడి శరీరంలో ఎలాంటి మార్పులు జరిగాయ్ అనేది అందులో తెలిపాడు. ఇక దోమలు కుట్టిన చోటా మొత్తం దద్దుర్లు గా మారి, విపరీతమైన దురద, నొప్పి కలిగిందని అతను తెలిపాడు. ఇక దోమలు కుట్టిన సమయంలో తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Our study on inbreeding and laboratory adaptation in mosquitoes is out now! https://t.co/AnE8KU5aJR pic.twitter.com/ckUadL6ChD
— Perran Ross (@MosWhisperer) November 28, 2018