భారతదేశ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇప్పుడు తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారి కోసం మారుతి సుజుకి తాజాగా కొత్త ఫైనాన్స్ స్కీమ్ లను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల కస్టమర్లకు మరింత లాభం చేకూరే అవకాశం ఉంది. మహేంద్ర ఫైనాన్స్ సర్వీసెస్ తో జత కట్టిన మారుతి సుజుకి…. మారుతీ కారు కొనుగోలు చేయాలని భావించే వారికి సులభంగానే లోన్ ను అందజేస్తోంది.
మహేంద్ర ఫైనాన్స్ మరియు మారుతి సుజుకి భాగస్వామ్యం వల్ల వ్యాపారం చేసేవారు, నెలవారి వేతనం పొందే వారు మరియు వ్యవసాయ రంగానికి చెందిన వారు కూడా సులభంగా లోన్ పొందవచ్చు. వివిధ రకాల ఈఎమ్ఐ స్కీమ్ లు అన్నీ తరగతుల వారికి అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయం చేసే వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనవి బెలూన్ ఈఎంఐ, బయ్ నౌ-పే లేటర్, స్తెప్ అప్ ఈఎంఐ స్కీమ్స్.
ఇకపై ఇందుకోసం ఆన్ లైన్ లోనే రుణం పొందే అవకాశాన్ని కూడా మహేంద్ర ఫైనాన్స్ వారు అందిస్తున్నారు. వేతన జీవులకు త్వరfఆ లోన్ లభిస్తుంది అంతేకాకుండా వారు లోన్ తీసుకున్న రెండు నెలల తర్వాత ఈఎంఐ చెల్లించవచ్చు. అగ్రికల్చర్ కస్టమర్లకు మూడు నెలల తర్వాత చెల్లించే విధంగా ఈఎంఐ స్కీమ్ అందుబాటులో ఉంది. స్టెప్ అప్ స్కీం కింద ఆరు నెలలకు ఈఎంఐ ను పెంచుకుంటూ వెళ్ళవచ్చు.
కాగా మారుతీ సుజుకీ ఇండియా కేవలం మహీంద్రా ఫైనాన్స్తో మాత్రమే కాకుండా ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో కూడా ఇలాంటి ఫైనాన్స్ స్కీమ్స్కు సంబంధించిన ఒప్పందమే కుదుర్చుకుంది.