తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీ కోసం స్థానిక గిరిజనులను రిజర్వ్ చేస్తూ ఇచ్చినటువంటి జివో ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
న్యాయ పరమైన, రాజ్యాంగ పరమైన అంశాలను అధ్యయనం చేసి పిటిషన్ దాఖలు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉండగా ఈ జీఓ ను తీసుకురావడం జరిగింది. సుప్రీం కోర్టు ఇటీవల దానిని కొట్టి వేయడం తో స్థానికముగా నివాసం ఉంటున్న వారికి అన్యాయం జరుగుతుందని గిరిజన సంఘాలు కేసీఆర్ కి విన్నవించుకున్నాయి.
1950 జనవరి 26 కి ముందుగా స్థానికం గా ఉంటున్న ఎస్టీ లకు రిజర్వేషన్ పద్దతి ఉందని, ఇపుడు సుప్రీం కోర్టు కొట్టి వేయడం ద్వారా చాలా మంది నష్టపోతారని గిరిజన సంఘాలు వాపోయాయి.రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులను సుప్రీం కోర్టు తీర్పు హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ ని సంఘాలు కోరాయి. వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. రాజ్యాంగ౦ వారికి కల్పించిన ప్రత్యేక హక్కులను కాపాడుతామని కేసీఆర్ తెలిపారు.