Saudi Arabia: ప్రపంచంలో మళ్లీ కరోనా వ్యాప్తి పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా కరోనా కేసులు వస్తున్న దేశం ఉత్తర కొరియా. దీంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ కరోనా వైరస్ కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఆ దేశంలో కరోనా లక్షణాలు ఎక్కువగా జ్వరం రూపంలో బయటపడుతుంది. అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా గాని కేసులు రోజు ఉన్న కొద్దీ పెరుగుతుండటంతో ఉత్తర కొరియా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటువంటి తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ పౌరులకు కరోనా విషయంలో కొత్త ఆంక్షలు విధించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భారత్ సహా 15 దేశాలకు వెళ్ళకూడదని సూచనలు ఇవ్వడం జరిగింది. దీంతో సౌదీ జాతీయులు ఇండియా తో సహా లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, ఆర్మీనియా, బెలారస్, వెనెజులా దేశాలలో అడుగు పెట్టకూడదని స్పష్టం చేయడం. ప్రస్తుతం మన దేశంలో చూస్తే పెద్దగా కేసులు ఏమీ లేవు. దేశవ్యాప్తంగా రోజు నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు వేలకి కూడా మించడం లేదు. మరణాల సంఖ్య కూడా పెద్దగా ఏమి నమోదు కావడం లేదు. అయినాగాని సౌదీ అరేబియా ప్రభుత్వం ఇండియాపై ఆంక్షలు విధించటం ఆ స్పష్టత సమాచారం, అవగాహన లోపం అని కొందరు అంటున్నారు. అయితే సౌదిలోకి భారతీయులు రావటం అన్నదానిపై… మాత్రం ఆంక్షలు విధించలేదు.
మరోపక్క ఆయా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండటం వల్లే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సౌదీ అరేబియా పాస్ పోర్ట్ కార్యాలయం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. అంతమాత్రమే కాదు మంకీ బాక్స్ కేసులకి సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సౌదీ అరేబియా వైద్య వర్గాలు తాజా ఆంక్షలపై వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం యూరప్ సహా ఇంకా మరికొన్ని దేశాలలో మంకీ పాక్స్ అనే కొత్త వ్యాధి… కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మంకీ పాక్స్ పై ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. దీంతో సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని… దాదాపు 16 దేశాల పై ఆంక్షలు విధించినట్లు అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు.