CM YS Jagan Davos Tour: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హజరైన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా పలువురు ప్రముఖులతో వరుస సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మౌళిక సదుపాయాలు, అభివృద్ధి గురించి సీఎం జగన్ వివరించారు. విద్యా వైద్య రంగంలో ఏపి ప్రగతిపై పలువురు ప్రశంసించారు. పంప్ట్ స్టోరేజ్, హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియాల తయారీపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో కొత్త గా నిర్మిస్తున్న పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి, పోర్టుల ఆదారిత పారిశ్రామికీకరణ అంశాాలపై చర్చించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులు వేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అడ్వాన్స్ డ్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు కాలుష్యం లేని ఇంథన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు వివరించారు. పలు అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చిస్తూ బిజిబిజీగా గడుపుతున్న సీఎం వైఎస్ జగన్ .. డబ్ల్యూఈఎఫ్ తో ఫ్లాట్ ఫామ్ పార్ట్ నర్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్ల్యుఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ఫ్వాప్, బీసీజీ గ్లోబల్ చైర్మన్ హన్స్, ఆదానీ గ్రూపు సంస్థల చైర్మన్ ఆదానీ తదితరులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
టెక్ మహేంద్రా చైర్మన్ , సీఈఓ సీపీ గురానీ, దస్సాల్ట్ సీఈఓ బెర్నార్డ్ ఛార్లెస్, జపాన్ కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఓఎస్ కే లైన్స్ లిమిటెడ్ సీఈఓ తకేషి హషిమోటో సమావేశమై సీఎం జగన్ చర్చలు జరిపారు. ప్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ పై నిర్వహించిన సెషన్ లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. హీరో మోటార్ కార్పోరేషన్ చైర్మన్, ఎండీ పవన్ ముంజల్, ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణ తదితర ప్రముఖులతోనూ జగన్ భేటీ కానున్నారు.