బాహుబలి చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అతని తదుపరి ప్రాజెక్టులు అన్నీ భారీవే కావడం విశేషం. ఇప్పుడు నటిస్తున్న సినిమాలపై కూడా భారీ నుంచి అతి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీటన్నింటిలో అభిమానులను ఎక్కువగా ఉర్రూతలూగిస్తున్న ప్రాజెక్టు మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ 21వ చిత్రం. ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం చాలా కాలం కష్టపడి ఒక స్క్రిప్ట్ వర్క్ ఔట్ చేశాడు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుండడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. ఈ సినిమాకు బాలీవుడ్ అగ్రకధానాయిక దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్ గా నివేథా థామస్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో స్క్రిప్ట్ ప్రకారం ఒక హాట్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయవలసి ఉందట. అందుకోసం నిధి అగర్వాల్ పేరుని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో నిధి అందాలకు కుర్రాళ్ళు వెర్రెక్కిపోతారు. ఆమె అకౌంట్ లను ఫాలో అయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువ.
అంతేకాకుండా మొన్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కూడా ఈమె హాట్ హాట్ గా చేయడంతో పాటు అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాలో బాగా మెప్పించింది. ఈ సాంగ్ కోసం నిధి నే టాప్ చాయిస్ అని చెబుతున్నారు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో నాగ్ అశ్విన్ స్వయంగా క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఇక సెంటిమెంట్ ప్రకారం ప్రభాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే అది బంపర్ హిట్ అయిపోయినట్టే అని అనుకుంటున్నారు. ఒక టాప్ హీరో చేయబోతున్న ఏ భారీ బడ్జెట్ చిత్రానికైనా ఐటమ్ సాంగ్ ఉంటే అది ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. నిధి కూడా తొలిసారి ఐటమ్ సాంగ్ ఎలా చేస్తుందో చూడాలి. 2022 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.