Talibans: గత ఏడాది ఆగస్టు మాసంలో తాలిబాన్ లు ఆఫ్ఘనిస్థాన్ లో.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడాం తెలిసిందే. 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ.. ఉంటూ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఆస్వాదించారు. అంతకుముందు తాలిబాన్ ల వలన అనేక నరకయాతన లు చూశారు. తాలిబాన్ చట్టాల వల్ల ఆఫ్ఘనిస్థాన్ లో అమ్మాయిలు.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు.. తమ సామ్రాజ్యాన్ని స్థాపించిన సమయంలో.. ప్రారంభంలో ఆఫ్గాన్ ఆడవాళ్ళు మరియు అమ్మాయిలు దెబ్బకు భయపడిపోయారు.
ఎందుకంటే చదువుకి తాలిబాన్ లు ఒప్పుకునే ప్రసక్తి ఉండదని .. రోడ్డుపైకి వచ్చేసి ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో తెలిసిందే. అప్పటికే దేశం విడిచి చాలామంది పారిపోగా… తాలిబాన్ లు ప్రభుత్వం స్థాపించాక ఆడవాళ్లు చదువుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తాలిబాన్ ప్రభుత్వంపై కొద్దిగా సానుకూలమైన స్పందన పాజిటివ్ దృక్పథం ఏర్పడింది.
అయితే మరి కొద్ది రోజుల్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో… అకాడమిక్ సంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో.. తాలిబాన్ ఆడ పిల్లలు ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకోవాలి. హై స్కూల్ మరియు కళాశాల విద్య అభ్యసించడానికి వీల్లేదు.. అంటూ తాజాగా తాలిబన్ ప్రభుత్వ పెద్దలు మాట మార్చడంతో… తాలిబాన్ బాలికలు నిరాశకు గురైనట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం గ్రామీణ ప్రజలు అన్ని.. తాలిబాన్లు స్పష్టం చేశారు. గ్రామీణ … గిరిజన ప్రాంత ప్రజలు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి అంగీకరించడం లేదని అందువల్ల బాలికలకు ఉన్నత విద్య ను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.