Russia Ukraine War: రష్యా మిలటరీ బలగాలు ఉక్రెయిన్ నీ ఆక్రమన్నే లక్ష్యంగా.. చేస్తున్న దాడులకు ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే. సైనిక పరంగా యుద్ధం ఇంకా టెక్నాలజీ పరంగా ఉక్రెయిన్ మిలటరీ కంటే రష్యా చాలా శక్తివంతమైన దేశం. ఈ క్రమంలో రష్యా బలగాలు… ఉక్రెయిన్ లో ప్రధాన నగరాల పై అదేవిధంగా ప్రభుత్వ భవనాల పై సినిమా థియేటర్లపై పాఠశాలలపై బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్య జనం అనేక ఇబ్బందులు పడటం మాత్రమే కాక చనిపోతున్నారు. మరోపక్క సైనికులు కూడా చనిపోతున్నారు.
ఇటువంటి తరుణంలో అసలు ఈ యుద్ధం వల్ల ఎంత నష్టం వాటిల్లింది అన్న దానిపై తాజాగా ఐక్యరాజ్యసమితి మీడియా నివేదికలు.. ఇంకా అగ్రరాజ్యం నుండి రకరకాల గణాంకాలు బయటపడ్డాయి. రష్యా చేసిన దాడుల వల్ల ఉక్రెయిన్ లో దాదాపు వెయ్యి భవనాలు కూలపోయాయి. అంత మాత్రమే కాక మూడు వేల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉక్రెయిన్.. మారియుపోల్ నగరాలలో దాదాపు వెయ్యి మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మారియుపోల్ నగరంలో ఆసుపత్రులు మరియు పాఠశాలలు పూర్తిగా నేలమట్టమయ్యాయి…అని నివేదికలో బయటపడ్డాయి.
ఆ నగరంలో విద్యుత్ మరియు నీళ్లు, ఆహారం కోసం జనాలు అలమటిస్తున్నట్లు.. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో ఐదు వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించినట్లు… వార్తలు వస్తున్నాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి 3.5 మిలియన్ ప్రజలు దేశం నుండి పారిపోయినట్లు చుట్టుపక్కల దేశం ఆశ్రయం పొందుతున్నాడు లెక్కల్లో తేలింది. ఇక ఉక్రెయిన్ లెక్కల ప్రకారం రష్యన్ సైనికులు 15 వేల మందికి పైగా మరణించినట్లు.. 200 కంటే ఎక్కువ ఫిరంగి వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఆ దేశ లెక్కల్లో బయటపడింది. ఇంకా వందకుపైగా హెలికాప్టర్లు దాదాపు 100 ఫైటర్ జెట్ లు… ఇంకా యాంటి ఎయిర్ క్రాఫ్ట్ సిస్టం… కూడా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ స్పష్టం చేస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ రెండు దేశాలు యుద్ధం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గక పోవడం మిగతా ప్రపంచ దేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం గ్యారంటీ అన్న టాక్ బలంగా వినబడుతోంది.