Ukraine Russia War: దాదాపు నెల రోజులకు పైగానే రష్యా బలగాలు ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ ఉన్నాయి. మరోపక్క చర్చలు కూడా జరుగుతున్నాయి కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విఫలం కావడంతో యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పుతిన్ ఆదేశాలతో రష్యన్ సైన్యం.. ఉక్రెయిన్ ..లో ప్రభుత్వ భవనాలను.. ప్రధాన నగరాలను అదేవిధంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు రష్యా చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తున్నాయి.
రష్యా దాడుల వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రష్యా చేస్తున్న దాడుల పట్ల… రష్యా దేశానికి చెందిన ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అన్నదానిపై లవెడా అనే సెంటర్ నిర్వహించిన పోల్ లో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. యుద్ధం ప్రారంభమైన అనంతరం రష్యాలో లవెడా సెంటర్ మార్చి 24 నుండి 30 వ తారీకు వరకు పోల్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ పోల్ లో 51% మంది యుద్ధం గురించి గర్వపడుతున్నారు అని తేలింది. ఇంకా 14 శాతం మంది .. రష్యా దాడుల పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నట్లు వెల్లడించారు.
దాదాపు రష్యాలో 50 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 65 శాతం మంది రష్యన్లు.. ఉక్రెయిన్ పట్ల రష్యా బలగాలు చేస్తున్న యుద్ధాన్ని సమర్థిస్తున్నారు. ఈ పోల్ లో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు దాదాపు 1500 మందికి పైగా పాల్గొనడం జరిగింది. కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఉక్రేయిన్ పై రష్యా బలగాలు చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. 8శాతం మంది సీరియస్ అవగా 12 శాతం మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోపక్క రష్యా యుద్ధం చేస్తున్న ప్రారంభంలో వివిధ దేశాలకు చెందిన మీడియా సంస్థలు.. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు సొంత దేశంలోనే పుతిన్ కి వ్యతిరేకత మొదలైంది అని వార్తలు ప్రసారం చేశాయి. కానీ తాజా సర్వేలో రష్యా ప్రజలు ఒత్తిడి తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఉన్నట్లు ఫలితాలు రావడంతో సంచలనంగా మారింది. ఈ పోల్ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలు పట్ల రష్యా ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు రష్యా మీడియాలో లవెడా సెంటర్ పోల్ సర్వే ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి.