Ukraine Russia War: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ప్రపంచ దేశాలు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తుండగా భారత్ దౌత్యనీతి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధానికి సంబంధించి ఖండించడం లేదా సపోర్ట్ చేయడం వంటివి ఏమీ చేయకుండా తటస్థ వైఖరితో భారత్… ఉక్రెయిన్ – రష్యా యుద్ధం విషయంలో సైలెంట్ గా ఉండటంతో అమెరికా సహా మిగతా కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే సమయంలో రష్యా పై అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తూ అమెరికా మిగతా కొన్ని దేశాలు కీలకంగా వ్యవహరిస్తున్న.. నేపథ్యంలో భారత్- రష్యా వద్ద తక్కువ ధరకే ముడిచమురు దిగుమతి చేసుకోవడం పట్ల ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇండియా పై అమెరికా కీలక ప్రకటన చేసింది. భారత్-చైనా సరిహద్దు లకు సంబంధించి వివాదం తలెత్తితే రష్యా ఇండియా కి మద్దతిస్తుందని అనుకుంటున్నారు కానీ.. రష్యా కి ఇప్పుడు అపరిమిత భాగస్వామిగా చైనా ఉంది. దీంతో చైనా దాడిచేస్తే రష్యా ఏమి మద్దతు ఇవ్వదు …. అంటూ అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుడు దలీప్ సింగ్ హెచ్చరించడం జరిగింది.
మరికొద్ది రోజుల్లో అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్ ఇండియా లో పర్యటిస్తున్న క్రమంలో అంతకు ముందు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ఆయనతో సమావేశమైన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. రష్యా నుండి చమురు కొనుగోలు లేదా మరే ఇతర వస్తువుల దిగుమతి ఈ విషయంలో ప్రస్తుతం కంటే అధికంగా.. దిగుమతి చేసుకోకూడదని.. ఒకవేళ దిగుమతి చేసుకుంటే అంతర్జాతీయ అంశాలు పరిధిలోకి వస్తుందని దలీప్ సింగ్ చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా రష్యా విషయంలో ప్రపంచ దేశాల ఆంక్షలకు అనుగుణంగా… ఇండియా నడుచుకోవాలని అమెరికా భావిస్తోంది.