Liger : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా “లైగర్” . పాన్ ఇండియా నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమాలో విజయ్ దేవరకొండ ని ఇంటర్నేషనల్ బాక్సర్ గా.. టీ అమ్ముకునే వ్యక్తి గా పూరి జగన్నాథ్ చూపిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ లు… ఫస్ట్ గ్లింప్స్… సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇటువంటి తరుణంలో సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో నడుస్తోంది. “లైగర్” డిజిటల్ రైట్స్.. రికార్డు స్థాయిలో అమ్ముడుపోయారని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రముఖ ఓటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో “లైగర్” నీ 60 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు అల్లు అర్జున్ “పుష్ప” సినిమా కి మించి బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. “పుష్ప” డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ 30 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.
కానీ విజయ్ దేవరకొండ “లైగర్” దానికి డబుల్ గా కలెక్ట్ చేయడం ఇండస్ట్రీలో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. డిజిటల్ బిజినెస్ ఎలా ఉంటే సాటిలైట్ రైట్స్ బిజినెస్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని.. ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25 వ తారీకు రిలీజ్ చేయటానికి పూరి టీం రెడీ అవుతోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పూర్తయినట్లు పూరి జగన్నాథ్ ఆడియో వాయిస్ ద్వారా తెలియజేయడం జరిగింది.