గత ఏడాది కాలంగా చర్చనీయాంశం అవుతున్న విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం.. గతకొన్ని రోజులుగా మరీ పీక్స్ కి చేరింది. మా కుటుంబ వ్యవహారాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించుకుంటున్నారని.. ఈ రోజు ట్రస్ లో అవకతవకలు జరగడానికి ఆయన కూడా ఒక కారణం అంటూ సంచయిత గజపతి ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ గా దివంగత ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత గజపతిరాజు నియమితులయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆనంద గజపతిరాజు – సుధాల కుమార్తె ఊర్మిళా గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్ ట్రస్ట్ కు తానే అసలైన వారసుడినంటూ మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు వాదిస్తుంటే… తానే అసలైన వారసురాలినని సంచయిత దూకుడుగా వ్యవహరిస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ విషయంలో బాబాయ్ రాజకీయం చేయడం తమను ఎంతో బాధించిందని.. తన తండ్రి ఆశయాల సాధనకు కృషి చేస్తున్నానని.. అవకాశం వస్తే భవిష్యత్ లో తప్పకుండా రాజకీయాల్లోకి అడుగుపెడతానని ఊర్మిళ తెలిపారు.
అనంతరం… ప్రజల కోసమే ఇంజినీరింగ్ కాలేజీలు, మాన్సాస్ ట్రస్ట్ ను ఆనంద గజపతి రాజు స్థాపించారని… ఆయన బ్రతికి ఉంటే తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిర్మించి ఉండేవారని… కానీ ఆశోక్ గజపతిరాజు మాత్రం.. తన తండ్రి తాతల ఆశయాలతో ట్రస్ట్ ను కొనసాగించలేదని ఆరోపించారు. తన తండ్రి మరణించేటప్పటికి తన వయసు 16 సంవత్పరాలు మాత్రమే గనుక ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడానికి అర్హత లేదని బాబాయ్ దూరంపెట్టారని ఊర్మిళ తెలిపారు!