కరోనా భూతం ఎవరినీ వదలడం లేదు. అటు సామాన్యులనే కాక ఇటు సినిమా సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను కూడా కరోనా భూతం వెంటాడుతోంది. కొద్ది సేపటి క్రితమే గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే.
ఇక ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం వైఎస్సారీసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది నిమిషాల క్రితమే ఈ వార్త తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు విషయంపై ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయనతో గత కొన్ని రోజులుగా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.