ఆత్మహత్యగా ప్రచారం జరిగిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు మృతిపై ఆమె భర్తే అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ఇదే సందర్భంగా తన తోడల్లుడి పై కూడా ఆమె భర్త అనుమానం వ్యక్తం చేయడం ఇక్కడ గమనార్హం .తన భార్య సుహారిక మృతిపై తనకు అనుమానాలున్నాయని ఫణీంద్ర సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుహారికకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు. ఆరోజు డ్రగ్స్ పార్టీ జరిగినట్లు ప్రచారం జరిగిందన్నారు. ఆ పార్టీలో పాల్గొన్న నలుగురు తప్పించుకు తిరుగుతున్నారని ఫణీంద్ర చెబుతున్నారు. తొలుత సీబీఐటీ వద్ద చనిపోయిందన్నారని, తర్వాత మాటమార్చారని చెప్పారు. అయితే తన తోడల్లుడుతో ఆర్థిక వివాదాలున్నాయని ఆయన చెప్పారు. అసలు నిజాలు బయటకు రావడం లేదన్నారు. తన భార్యది హత్యా? ఆత్మహత్య అన్నది తేల్చాలని కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర సైబరాబాద్ పోలీసులను కోరారు.ఇదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.ఇప్పటి వరకు మరుగున పడి ఉన్న ఈ కేసు మొదటికి రావడంతో సైబరాబాద్ పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది