సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంటరైన చాలామంది తమ అందాన్ని సరి చేసుకుంటుంటారు. వెండి తెరమీద అందంగా కనిపించేందుకు, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎంత తాపత్రయపడుతుంటారో తెలిసిందే. ఈ క్రమంలో చాలామంది హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుంటున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి.. శిల్పాశెట్టి.. అమీషా పటేల్..నయనతార.. ఇలా చాలామంది హీరోయిన్స్ తమ ముఖంలో ఏదో ఒక భాగం సర్జరీతో సరి చేయించుకోవడం వలనే సిల్వర్ స్క్రీన్ మీద అందంగా కనిపిస్తున్నారని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే గత కొంతకాలంగా శ్రుతిహాసన్ ముక్కుకు సర్జరీ జరిగిందన్న వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ విషయంలో శ్రుతికి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ప్రతిసారీ తను సర్జరీ చేయించుకున్నానని, తన అందం తన ఇష్టమే ..అని చెపుకొచ్చింది శ్రుతిహాసన్. లక్ అనే బాలీవుడ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకొచ్చిన శ్రుతిహాసన్ ని కొందరు మగరాయుడు అని కామెమంట్ చేశారట. దాంతో తన అందాన్ని మెరుగు పరచుకునేందుకు సర్జరీ చేపించుకుందన్న వార్త అప్పట్లో బాగా వైరల్ గా మారింది.
అదే విషయాన్ని తాజా వెల్లడించింది శ్రుతి హాసన్. తన మొదటి సినిమా సమయంలో కామెంట్ చేశారని అందుకే తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నానని దాపరికం లేకుండా ఒప్పుకుంది. ఇక ప్రస్తుతం శ్రుతిహాసన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. మాస్ మహారాజ రవితేజ, గోపీ చంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా దాదాపు కంప్లీట్ అయుందట. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలోను ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని సమాచారం.