బీజేపీకీ కోపమొస్తే ఏం జరుగుతుందో తెలియడానికి రెండు ఉదాహరణలు.. ఓ ఐఏఎస్ అధికారిపై వేటు పడింది. ఓ చానెల్ సీఈఓపై వేటు పడింది. ఈసారి బీజేపీకి కోపం వస్తే ఏం జరుగుతుందో. అందుకే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారూ.. తస్మాత్ జాగ్రత్త. టీటీడీ చైర్మన్ గా చేపట్టిన ఈ14నెలలో మీ ముద్ర చూపకపోగా.. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఆగ్రహానికి గురై మీరు పదవి కోల్పోతే.. ఇచ్చేందుకు రాజ్యసభ సీటు కూడా లేదు. అందుకే సుబ్బారెడ్డి గారూ.. తస్మాత్ జాగ్రత్త.
ఏం జరిగిందంటే..
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా హిందువులు అత్యంత విశ్వాసంతో, భక్తితో ఆ కార్యక్రమం కోసం ఎదురుచూశారు. కార్యక్రమం ఆసాంతం టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి పులకించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 చానెళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కానీ.. తెలుగులో కేవలం భక్తి, దేవుడు, భక్తుల కోసమే ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ అయోధ్య కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకపోగా కనీసం 5నిముషాలు కూడా చూపించలేదు. దీంతో బీజేపీ పెద్దలకు కోపం వచ్చింది. దీంతో బీజేపీ అధిష్టానం ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎస్వీబీసీ చానెల్ సీఈవో నగేశ్ పై పడటం కొత్తవారు రావడం జరిగిపోయింది.
సీఈవోపై వేటు.. కొత్త సీఈవోగా సురేశ్ కుమార్..!
సప్తగిరి దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరక్టర్ గా పని చేస్తున్న సురేశ్ కుమార్ ను దేవాదాయ శాఖకు కేటాయిస్తే సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర సమాచార శాఖ అధికారి అయిన సురేశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి ఏపీకి మూడేళ్ల డిప్యుటేషన్ పై వచ్చారు. హిందూ ధర్మ ప్రచారం కోసమే ఏర్పాటైన ఎస్వీబీసీలో అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమం ప్రసారం చేయలేదు. దీంతో హిందూ ధార్మిక సంఘాలు తప్పుబట్టాయి. ఆ సమయంలో శ్రీవారి కల్యాణోత్సవం ప్రసారమవుతోందని టీటీడీ వివరణ ఇచ్చినా కేంద్రస్థాయిలో ఒత్తిడితో సీఈవోను తప్పించారని తెలుస్తోంది.