మిజోరాంకు చెందిన శాసనసభ్యుడు డాక్టర్ జెడ్ఆర్ థియామ్ సంగ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగానే గాకుండా, ఒక వైద్యుడిగా కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆయన మరోసారి డాక్టర్ అవతారమెత్తారు.
తాజాగా… ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆయన పురుడు పోశారు. సమయానికి ఎమ్మెల్యే స్పందించడంతో.. బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల సంభవించిన భూంకపాలు, కరోనా వైరస్ తీవ్రతతో పాటు ఇతర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలోనే నాగూర్ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది.
వృత్తిరీత్యా గైనకాలజీ డాక్టర్ అయిన థైమ్సంగా.. చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉండటంతో గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్ చేశారు. తల్లి బిడ్డ లెటర్ని కాపాడారు తల్లీబిడ్డలు ఇద్దరినీ కాపాడారు. కాన్పులు చేయడంలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ గైనకాలజిస్ట్ 2018లో ప్రభుత్వ ఉద్యోగం నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు.
మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయన ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటికీ ఎక్కడికెళ్లినా ఆ ఎమ్మెల్యే తన వెంట మెడికల్ కిట్టు తీసుకెళ్తారు . ఆయన కూతురు డాక్టర్ జూలీ కూడా ఎప్పుడూ థైమ్సంగ వెంటే ఉంటారు. ‘ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉండొచ్చు.కానీ డాక్టర్ నాకు వృత్తే నాకు ముఖ్యం.. ప్రజా సేవ కంటే ప్రాణాలు పోయడం అతి గొప్ప విషయం.. అదే నాకు ఆమిత సంతృప్తినిస్తుంది”” అని చెప్పే థైమ్సంగా అరుదైన శాసనసభ్యుడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!