స్వతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఉన్న కోవిద్ ప్రోటోకాల్ ను అనుసరించి వేడుకలు నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలో వేడుకలకు పిలవనున్నారు. ఏటా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఈసారికి నిర్వహించడం లేదు.
అలాగే పరిమిత సంఖ్యలోనే పాసులు ఇవ్వనున్నారు. కార్యక్రమం నిర్వహించే విధి విధానాలను రూపొందించడానికి జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూనే కవాతు ప్రదర్శనలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే సీటింగ్ నిర్వహణ కూడా చేయనున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా మున్సిపల్ స్టేడియం చిత్తడిగా మారడంతో నిలిచిన నీటిని తోడి కవాతుకు అనుకూలంగా రోడ్లు వేస్తున్నారు. వేడుకలకు ఏ గేట్ నుండి ఎవరిని ఆహ్వానించాలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.