NewsOrbit
న్యూస్

ఇది కరెక్టు యాంగిల్ ! వైఎస్ జగన్ పాలనకు అతి పెద్ద మచ్చ ఇదే !!

పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా గుండెకాయ వంటిది.పోలీసు శాఖలో ప్రభుత్వంపై అసంతృప్తి పొడసూపితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.

 This is the correct angle! This is the biggest scar of the YS Jagan regime
This is the correct angle! This is the biggest scar of the YS Jagan regime

ప్రస్తుతం v ప్రభుత్వం విషయంలో పోలీసు శాఖ కొద్దిగా అసంతృప్తిగా ఉందంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై వరుసగా జరుగుతున్న దాడుల ఘటనల్లో వైసీపీ నేతల్ని కాపాడటానికి పోలీసుల్నే బలి పశువులు చేస్తున్న వైనం ఇందుకు ప్రధాన కారణం.చివరకు ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఘటనల విషయంలో పోలీసులనే తప్పు పట్టడంతో వారు లోలోపల రగిలిపోతున్నారట.తాజాగా సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో పోలీసుల వ్యవహార శైలి పట్ల తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

పోలీసులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన ఆశ్చర్యపోయారు. హోంమంత్రి ఎస్సీ.. డీజీపీ ఎస్టీ అయినా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలని హితవు పలికారు. దళితుల మీద దాడులు చేసే పోలీసులను సీఎం జగన్ గట్టిగా హెచ్చరించారు. అరెస్టులు సైతం జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు.ఇదే పోలీసులకు నచ్చలేదు. తమకేమి ప్రత్యేకంగా దళితులపై కోపమంటూ ఉండదని అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే కొన్ని సందర్భాల్లో అవుటాఫ్ ది వే వెళతామని,అయితే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులను బలిపశువులను చేసి సొంత పార్టీ నేతలను కాపాడుకోవటం సరైన విధానం కాదని పోలీసు సంఘం చెబుతోంది.

ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసును ఉదహరించక తప్పదు. శిరోముండనం ఘటనలో ట్రైనీ ఎస్‌ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. దానికి కారణం ఓ వైసీపీ నేత. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ వైసీపీ నేతను అడ్డుకున్నందుకు వరప్రసాద్‌ను కొట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైసీపీ నేతల ప్రోద్భలంతోనే ట్రైనీ ఎస్‌ఐ ఆ యువకుడికి శిరోముండనం చేయించాడు.

ఈ విషయంలో చాలా పెద్ద పెద్ద పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందుకే పోలీసులు లైట్ తీసుకున్నారు. రాష్ట్రపతి స్పందించాక తీరిగ్గా ఈ ఘటనపై రియాక్ట్ అయిన సీఎం తప్పు అంతా పోలీసులపై నెట్టేశారు. తన పార్టీ నేతల వరకూ రానివ్వలేదు. ఒక్క ప్రసాద్ విషయంలోనే కాదు… శ్రీకాకుళం జిల్లాలో ఓ దళితుడి గుండెపై కాలుతో తన్ని మరో అధికారి వ్యవహారంలోనూ వైసీపీ నేతలదే తప్పు. దళితులపై జరిగిన అనే దాడుల ఘటనల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదులున్నా దాన్ని పట్టించుకోకుండా పోలీసుల్ని సిఎం వేలెత్తి చూపడం అనేది ప్రమాదకరమైన పోకడగా పరిశీలకులు భావిస్తున్నారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella