NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సచివాలయాలు…. మొదటికే మోసం తెస్తున్నాయా…?

జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సచివాలయ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా అతనికి విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ అయితే అతనిపై ప్రశంసల వర్షం కురిపించింది. అయితే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలు కొన్ని సర్కార్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యనే సచివాలయంలో అవినీతి బయటపడడం కొంతమంది వాలంటీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేయడం…. అంతేకాకుండా గ్రామస్తులకు కాలం గడిచే కొద్దీ వస్తున్న కొత్త అనుభవాలు జగన్ ప్రభుత్వానికి కొద్దిగా వణుకు పుట్టిస్తున్నాయి.

 

Finally, YSRCP decides to repaint all Government buildings - Gossiper

వివరాల్లోకి వెళితే…. సచివాలయం కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ వాటిని ఏర్పాటు చేసే విషయంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి కి తలనొప్పిగా మారాయి. గ్రామ సచివాలయ భవనం ఏర్పాటు కోసం అధికారులు కొన్ని స్థలాలను కేటాయించారు. అవి కాస్తా వివాదాస్పదంగా మారాయి. భూములు అధికార పార్టీకి చెందిన నేతలు సచివాలయాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలేని లక్షలాదిమందికి భూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఒక పక్క చేపడుతున్న ప్రభుత్వం ఇలా ఉన్న వారి దగ్గర భూములను లాక్కొని సచివాలయ భవనాలను నిర్మిస్తున్నారన్న విమర్శ చాలా దారుణంగా ఉంది. కొన్నిచోట్ల అధికారుల అత్యుత్సాహం కారణంగా పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

తాజాగా అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామం లో ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ప్రతి పంచాయతీకి ఒక సచివాలయ భవనాన్ని రైతు భరోసా కేంద్రాన్ని వెల్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి. అధికారులు సచివాలయ నిర్మాణానికి స్థలాన్ని చదును చేసే ప్రయత్నంలో బాధితులు వాగ్వాదానికి దిగారు. ఆ భూమి ఆన్లైన్ లో కూడా తమ పేరునే ఉందని చెప్పినా అధికారులు వినలేదు. అధికార పార్టీ నేత ఇన్వాల్మెంట్ కారణంగానే ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంది అని మహిళా రైతు లక్ష్మీదేవి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్ళింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను గమనించుకొని సచివాలయ శాఖ ఉద్యోగులను మిగతా ప్రభుత్వ వారితో కలిసి పని చేసే విధంగా ఒక ఫార్మేట్ రూపొందిస్తే సరిపోతుందని అంటున్నారు. లేకపోతే వీరిని సపరేట్ యూనిట్ గా ఉంచి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగిస్తే చివరికి ప్రభుత్వం వారు భారీగా ఇబ్బంది పడతారని భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా ప్రభుత్వ కార్యకలాపాలలో ఎటువంటి అవినీతి ఉండకూడదు అని.. జనాలకి అత్యంత చేరువగా ప్రభుత్వ సేవలను అందించాలని మొదలుపెట్టిన సచివాలయంలోనే ఇలా జరుగుతుండడం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N