కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ స్టార్స్ తో నటిస్తుంది. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారిపాట లో హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. ఇక ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే అన్న ద్విభాషా చిత్రం లో కూడా నటిస్తుంది. ఈ సినిమాలు కాకుండా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ప్రకటించిన ఒక ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్ పేరు ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇక ఇప్పటికే కమిటయిన సినిమాలు గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా త్వరలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తుందట. కాగా కీర్తి నటించిన గత చిత్రం పెంగ్విన్ ఓటీటీలో రిలీజై అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. దాంతో లేడీ ఓరియెంటెడ్ గా రూపొందుతున్న గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజైన గుడ్ లక్ సఖీ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
పెంగ్విన్ సినిమా మాదిరిగానే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ కూడా డిఫ్రెంట్ జోనర్ లో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలలో కీర్తి ఛాలెంజింగ్ రోల్స్ పోషిస్తుందని అంటున్నారు. అయితే పెంగ్విన్ సినిమా తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న ఓటీటీ కే పరిమితం అన్న మాట వినిపిస్తుంది. కాని కొంతమంది మాత్రం ఇది కరెక్ట్ కాదన్న కామెంట్స్ చేస్తున్నారు. థియోటర్స్ ఓపెన్ కాకపోవడంతోనే నిర్మాతలకి సపోర్ట్ గా నిలిచి తను నటిస్తున్న సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అంగీకరించిందని .. ఈ విషయంలో కీర్తి ని ప్రశంసించాలని అంటున్నారు.
అయితే ఇప్పుడు ఈ విషయంలో కీర్తి మనసు మార్చుకుందని తెలుస్తుంది. మిస్ ఇండియా సినిమాని త్వరలో అమెజాన్ ప్రైం లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దాంతో మేకర్స్ క్లారిటి ఇచ్చారు. ఇప్పటి వరకు మిస్ ఇండియా సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. ఇకపై కీర్తి సురేష్ సినిమాలు థియోటర్స్ లోనే రిలీజ్ చేయడమే బెటరని అనుకుంటున్నారట. ఒకవేళ ఓటీటీలోనే వరసగా కీర్తి నటించిన సినిమాలు రిలీజైతే మాత్రం కెరీర్ మీద కాస్తో కూస్తో ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది.