ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అధికశాతం మంది ఏటా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అనేక మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే డయాబెటిస్ బారిన పడిన వారు నిత్యం సమయానికి ఆహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలి. తగిన సమయానికి నిద్రించాలి. తగినన్ని గంటల పాటు పడుకోవాలి. అలాగే డయాబెటిస్ ను అదుపు చేసేందుకు సహకరించే ఆహారాలను కూడా తీసుకోవాలి. ఇక ఆహారాల విషయానికి వస్తే.. ఆలివ్ పండ్లు డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచేందుకు అత్యుత్తమంగా సహాయపడతాయని చెప్పవచ్చు.
ఆలివ్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కార్బొహైడ్రేట్లు చాలా స్వల్ప మొత్తంలో ఉంటాయి. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసేందుకు సహాయపడుతుంది. అందువల్ల షుగర్ అదుపులో ఉంటుంది. కనుక ఆలివ్ పండ్లను డయాబెటిస్ ఉన్నవారు నిరభ్యంతరంగా తినవచ్చు. ఇవి షుగర్ను అదుపు చేస్తాయి.
ఆలివ్ పండ్లలో లేదా ఆయిల్లో ఓలియురోపెయిన్ అనబడే పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి ఒత్తిడి కారణంగా శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తాయి. అందువల్ల ఒత్తిడి కారణంగా డయాబెటిస్ అధికమవుతుందని భావించే వారు ఆలివ్ ఆయిల్ లేదా పండ్లను తీసుకుంటే ఫలితం ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ లేదా పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ను వంటలకు వాడవచ్చు. ఆలివ్ పండ్లను శాండ్ విచ్లు, సలాడ్లు, పాస్తాల్లో లేదా ఇతర ఆహారాల్లో భాగంగా తీసుకోవచ్చు. లేదా నేరుగా తినవచ్చు. ఎలా తీసుకున్నా ఆలివ్ ఆయిల్ లేదా పండ్ల వల్ల డయాబెటిస్ను అదుపు చేయవచ్చు.