గత కొన్ని రోజుల నుండి అమరావతి రాజధాని వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ అమరావతి రాజధాని అనేది దేశంలోనే అతిపెద్ద స్కాం అని ఆరోపిస్తోంది. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ విధానం ద్వారా తన బినామీలకు మరియు కుటుంబ సభ్యులకు రాజధాని ఆ ప్రాంతంలో వస్తుందని ముందే లీక్ చేసారని ఆరోపిస్తున్నారు. ఇందువల్లే అమరావతి రాజధాని ప్రాంతంలో టిడిపి పార్టీ ప్రజాప్రతినిధులు చంద్రబాబు బినామీలు రాజధాని భూములు కొనుగోలు చేశారని విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటికే అమరావతి రాజధాని వ్యవహారంలో జరిగిన అవినీతిని ఒక నివేదికగా వైసీపీ నుంచి దానిపై విచారణ చేయడానికి రెడీగా ఉంది. మరోపక్క ఈ విషయంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అన్నది సస్పెన్స్ గా ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ టాప్ డైరెక్టర్ అమరావతి లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఓ సంచలన వార్త రాజకీయరంగంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. దాదాపు 80 ఎకరాల భూమిని ఈ టాప్ నిర్మాత రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు ఇప్పుడు వైసీపీ ఈ విషయంలో విచారణకు రెడీ అవుతున్న తరుణంలో ఈ బడా నిర్మాత గుండెల్లో గుబులు మొదలైనట్లు టాక్ వస్తోంది.
ఇటువంటి తరుణంలో ఆ నిర్మాత అధికార పార్టీ నేతలతో మాట్లాడి కొనుగోలు చేసిన భూమిని తక్కువ ధరకు వేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అమరావతి రాజధాని కుంభకోణం విషయంలో సీబీఐ విచారణకు జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో మిగతా వారిలో భూములు కొనుగోలు చేసిన వారిలో కూడా టెన్షన్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అమరావతి రాజధాని భూముల విషయంలో జగన్ సర్కార్ అవలంబిస్తున్న తీరు చాలా మందిలో టెన్షన్ పుట్టిస్తున్నట్లు టాక్.