మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి చుట్టూ రాజకీయాలు జరిగాయి. వైయస్ జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో విపక్షాలు మొత్తం తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. డిక్లరేషన్ అంటూ విపక్షాలు జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా తిరుపతి పార్లమెంటు సభ్యుడు మరణించడంతో అక్కడ మరో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తే చాలా వరకు ప్రజలు ప్రభుత్వం చేస్తున్న పనులకు సానుకూలంగానే ఉంటున్నారు.
విపక్షాలు ఎన్ని విమర్శలు మతపరంగా గాని భాష విషయంలో గాని వ్యతిరేకత తీసుకురావాలని భావించిన ప్రజలలో సరైన రెస్పాండ్ రావటం లేదు. మరోపక్క జాతీయస్థాయిలో మాత్రం జగన్ అద్భుతమైన పరిపాలన చేస్తున్నట్లు ర్యాంకుల మీద ర్యాంకులు వస్తున్నాయి. రాష్ట్రంలో చాలా వరకు వైసిపి ప్రభుత్వానికి సానుకూలమైన వాతావరణం ఉంది. ఇలాంటి తరుణంలో తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మొన్నటి వరకు రాజకీయాలు చేసిన చంద్రబాబు మాత్రం భయపడుతున్నట్లు టాక్ వస్తుంది. ఉప ఎన్నిక విషయంలో టిడిపి పార్టీ తరఫున అభ్యర్థి నిలబడకుండా తటస్థంగా వ్యవహరించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉప ఎన్నిక విషయంలో మరోపక్క బీజేపీ మాత్రం ఎలాగైనా ఎన్నికలకు అభ్యర్థిని నిలబెట్టడానికి ఆలోచన చేస్తున్నట్లు టాక్. మరోపక్క టీడీపీలో ఉన్న సీనియర్లు మాత్రం తిరుపతి ఉప ఎన్నిక అమరావతికి రిఫరెండంగా వెళితే బాగుంటుందని చంద్రబాబుతో అంటున్నా గాని బాబు మాత్రం ససేమిరా అంటున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఎన్నికలలో పోటీ చేయకపోతే పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చంద్రబాబుతో సీనియర్లు అంటున్నారట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పోటీకి దిగితే ఓడిపోయే అవకాశం ఉందని చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం.