NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం..! సహాయానికి మోడీ హామీ..!!

 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో కుండపోతగా కురిసిన వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. వరద ప్రవాహానికి  వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీధులన్నీ జలమయం అయి చెరువులను తలపించాయి. 1500 ఇళ్లకుపైగా జలదిగ్బంధమయ్యాయి. 20 వేలకు పైగా ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు దెబ్బతిన్నాయి. వీధుల్లో నిలిపిన కార్లు, ఆటోలు, బైక్ లు వరద నీటికి కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడపాల్సి వచ్చింది. 30 పాత పాత భవనాలు, గోడలు కూలిపోయాయి. సహాయక చర్యల కోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. వందేళ్ల తరువాత కురిసిన రికార్డు వర్షపాతానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ  13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షలు జరిపి యుద్ద ప్రాతిపదికన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలోనూ భారీ వర్షాలు, వరదలకు వందలాది మంది నిరాశ్రయులైయ్యారు. కృష్ణానదికి వరద పోటేత్తడంతో నది పరివాహాక ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. వేలాది పంట పంట పొలాలు ముంపునకు గురి అయ్యాయి. వివిధ జిల్లాలలో పది మంది మృత్యువాత పడ్డారు. చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై ఆదేశాలు ఇచ్చారు.

కేంద్రం నుండి సహకారం అందిస్తాం – మోడి

కాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఫోన్ చేశారు. భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపి సీఎం వైఎస్ జగన్‌లతో మోడీ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో కేంద్రం నుండి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు మోడి. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోని భారీవర్షాలు, వరదల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఇరు రాష్ట్రాలకు సాధ్యమైనంత సాయం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. వరద నష్టం నుండి త్వరగా రెండు రాష్ట్రాలు కోలుకోవాలని అమిత్ షా అకాంక్షించారు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!