ఏదైనా ఫెస్టివల్ అయితే చానెళ్లలో పండుగే పండుగ ఇక. దసరా పండుగ త్వరలో రానుంది కదా. అందుకే ఈటీవీలో అక్కా ఎవరే అతగాడు.. అనే ఈవెంట్ ను ఈటీవీలో నిర్వహిస్తున్నారు. ఈ షోకు నవదీప్, శేఖర్ మాస్టర్, సుధీర్, రష్మీ, వర్షిణి, సంగీత వచ్చి.. సందడి చేశారు.
ఈ షోలో వాళ్లు చేసిన రచ్చ మామూలుగా లేదు. సంగీత అక్కగా.. రష్మీ, వర్షిణీ చెల్లెలుగా నటించిన ఈ ఈవెంట్ లో నవదీప్ ఎంట్రీ ఇచ్చి.. చేసిన రచ్చ మామూలుగా లేదు.
నీకు యాంకరింగ్ కూడా నేర్పించాల్సింది వర్షిణీ అంటూ నవదీప్ వర్షిణీకి పంచ్ వేయడం… నా పెళ్లి లంగ రంగ వైభవంగా ఉండాలి.. అంటూ వచ్చీరాని తెలుగులో రష్మీ మాట్లాడటం.. అన్నీ ఈ షోకు పెద్ద హైప్ ను తీసుకొచ్చాయి.
ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఈటీవీ తాజాగా రిలీజ్ చేసింది. అయితే.. రష్మీ, వర్షిణీని మాత్రం నవదీప్ ఓ ఆట ఆడుకున్నాడు. సంగీత యాంకరింగ్ చేసింది. మొత్తం మీద దసరా రోజు అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి మరో షో రెడీ అయిపోతోంది. దాని ప్రోమోను ఓసారి చూసి కాసేపు నవ్వుకోండి మరి..
https://www.youtube.com/watch?v=mtGcSS2xIhE