అమరావతి, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల కోటా ఎంఎల్సీ అభ్యర్థిగా వైసిపి నేత జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు.
వైసిపి అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైసిపి ఎమ్మెల్యేలు, నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలం సురేష్, ముస్తఫా, రక్షణనిధి, మేక ప్రతాప్ అప్పారావు, కంబల జోగులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
టిడిపికి నాలుగు, వైసిపికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది.