ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా .. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఇక వారి ఆనందానికి హద్దులే ఉండవు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న, ఎన్నో ప్రార్థనలు చేసిన , ఎంత కష్టపడ్డా కోరుకున్న ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన యువకులు, నిరుద్యోగుల సంఖ్య కోకొల్లలు.ఇందుకు వింతగా తమిళనాడు, కన్యాకుమారిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మి తీరాల్సిందే.
ఈ నేపథ్యంలో లో తనకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తే జీవితాన్ని త్యాగం చేస్తానని భగవంతుడిని మొక్కుకున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే నవీన్ కు ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం లభించింది. ఎన్నో ప్రయత్నాల తరువాత ఉన్నత ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఎంతో సంతోషపడ్డారు. వెంటనే అతను ముంబై వెళ్లి ఉద్యోగం లో చేరాడు అక్కడ 15 రోజుల పాటు ఉద్యోగం కూడా చేశాడు. ముంబై నుంచి త్రివేండ్ర వెళ్తున్న రైలు కింద పడి గత శనివారం ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల్లో విషాదంలో నింపింది. అయితే నవీన్ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. అతని చేబులో స్వాధీనం చేసుకున్న సూసైడ్ లెటర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానిలో తాను భగవంతునికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు, ప్రభుత్వ ఉద్యోగం వస్తే భగవంతుని దగ్గరకు వచ్చేస్తానని మొక్కుకున్నట్లు అందుకోసమే తను ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో తెలిపాడు. నవీన్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కు తరలించారు అయితే ఈ ఉదంతంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ నవీన్ ఆత్మహత్యకు వేరే కారణాలు ఏమైనా ఉంటాయన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అతని సన్నిహితులు దగ్గరనుండి వివరాలు తీసుకున్నారు.