దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటి వరకూ ఏడు రౌండ్ లు కౌంటింగ్ పూర్తి అయ్యింది. అయిదు రౌండ్ల వరకూ బీజేపీ అభ్యర్థి రఘునందనరావు లీడ్లో కొనసాగగా ఆరవ రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత స్వల్ప అధికత్య కనబరుస్తున్నారు. అయిదు రౌండ్ లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి రఘునందనరావు 3020 ఓట్ల ఆధికత్యతో ఉన్నారు. ఆరవ రౌండ్ లో 353 ఓట్లు, ఏడవ రౌండ్ లో 182 ఓట్లు టీఆర్ ఎస్ అభ్యర్థి సుజాత ఆధిక్యంలో ఉన్నారు. ఏడు రౌండ్ లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి అధిక్యత 2485 ఓట్లకు తగ్గింది. ఆరవ రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ కొనసాగిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది.