NewsOrbit
న్యూస్

అప్పుడు నందిగం సురేష్ బాబు …ఇప్పుడు డాక్టర్ గురుమూర్తి!జగన్ రూటే సపరేటు!!

ఏమాత్రం ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులను ఏకంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించడం అనేది ఏపీ సీఎం ,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పెషాలిటీగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.అదే సమయంలో ఆ కోవకు చెందిన అభ్యర్థుల విషయంలో పార్టీ పట్ల తన పట్ల వారికున్న నిబద్ధతను కూడా ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ముఖ్యంగా దళిత నేతల విషయంలో జగన్ ఈ ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ సందర్భంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్బాబు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎంపికైన డాక్టర్ గురుమూర్తిలను రాజకీయపరిశీలకులు ఉదహరిస్తున్నారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో గడ్డివాములు తగలబెట్టారన్న కారణంతో నందిగం సురేష్ బాబును పోలీసులు తీవ్రంగా హింసించారు.ఒక దశలో తనను చంపేయడానికి కూడా పోలీసులు పథకం వేశారని సురేష్ బాబు చెబుతుంటారు.అయితే ప్రాణ త్యాగానికి కూడా సురేష్ బాబు సిద్ధపడడాని పరిగణనలోకి తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆయన్ను బాపట్ల లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు.

తదుపరి ఎంపీ సీటు ఇచ్చి గెలిపించారు.అంతేకాదు ఆయన చేతనే మొన్నటి లోక్సభ ఎన్నికల వైసిపి ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయించారు.తాడేపల్లిలోని వైసిపి పార్టీ కార్యాలయాన్ని సురేష్బాబు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జగన్ ప్రారంభింపజేశారు.ఇప్పుడు తాజాగా తన కుటుంబానికి అత్యంత విధేయుడు సోదరి షర్మిల, తన పాదయాత్రల సందర్బంగా వెన్నంటి ఉండి ఫిజియోథెరపిస్టుగా సేవలందించిన డాక్టర్ గురుమూర్తిని ఆయన తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. డాక్టర్ గురుమూర్తి వైఎస్సార్ కుటుంబానికి విధేయుడు. వైసిపికి వీరాభిమాని.తన వృత్తిని కూడా వదులుకొని ఆయన జగన్ వెంటే నడుస్తుంటారు.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న జగన్ ఆయన్ను ఎంపీ స్థానంలో పోటీకి నిలబెట్టారు.నిజానికి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వాలన్న సంప్రదాయాన్ని కూడా జగన్ పక్కన పెట్టారు.కనీసం పది లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేనని డాక్టర్ గురుమూర్తి చెప్పినప్పటికీ అంతా నేను చూసుకుంటానని జగన్ భరోసా ఇచ్చి మరీ ఆయన భుజం తట్టారు.జగన్ తీసుకున్నది సంచలన నిర్ణయమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.ఈ చర్య ద్వారా ఆయన దళిత హృదయాలను కూడా గెలుచుకున్నారు.నమ్మిన వారికి తాను కొంగుబంగారమని జగన్ నిరూపించుకున్నారు.

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju