విశాఖ నగరంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సోమవారం అకస్మాత్తుగా దాడులు చేసింది.. నగరంలోని అన్ని లడ్డూలను విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయన అధికారికంగా కొంతమంది వ్యక్తుల వద్ద ఉన్న రూ కోటి రూపాయల నగదును గుర్తించారు. దానికి ఎలాంటి లెక్క పత్రాలు లేకపోవడంతో పాటు అనుమానాస్పదంగా వ్యక్తులు ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని నగదు సీజ్ చేశారు. కోటి రూపాయల నగదును తీసుకువచ్చిన నిందితులు భరత్ కుమార్ రాజ్ పురోహిథ్, చోటారం, హైదరాబాద్ నుండి బస్ లో డబ్బులు తీసుకు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఆ డబ్బులు ఎందుకు తీసుకు వచ్చారు దేని కోసం తీసుకువచ్చారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడుల్లో దువ్వడా పరిధిలో ఇనోవా కార్ లో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయి ని పట్టుకున్న పట్టుకున్నారు. విశాఖ గిరిజన ఏజెన్సీ గ్రామాల నుంచి గంజాయిని సాగు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితులను పట్టుకున్నారు. విశాఖ నగరంలో ఉదయం నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు కొనసాగాయి
టాస్క్ఫోర్స్ ,దిశా ఏసీపీ ప్రేమ్ కాజల్…..